Covid-19 Symptoms | కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభానికి కారణమైంది. రెండేళ్లు దాటినా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతున్నది. వైరస్కు అంతమెప్పుడో నిపుణులు సైతం ఏమీ చెప్పలేది పరిస్థితి ఎదురవుతున్నది. ఇటీవల భారత్లో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 17వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. ఇది గత నాలుగు నెలల్లోనే అత్యధికం. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్తో పాటు దాని సబ్ వేరియంట్లు కారణమని, ఇవి ఎక్కువ ఇన్ఫెక్షన్ చూపుతాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దేశంలో పెరుగుతున్న కేసుల మధ్య ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో వృద్ధులకు, పిల్లల్లో రోగనిరోధకత, కేసుల పెరుగుదల దృష్ట్యా జీనోమ్ సీక్వెన్సింగ్పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. అదే సమయంలో వైరస్లోని ఉత్పరివర్తనాల కారణంగా కొత్త వేరియంట్ల బారినపడిన వారిలో అనేక కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా మహమ్మారిపై శాస్త్రవేత్తల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. కాలక్రమేణా వైరస్ ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తించారు. ఓ వైపు కొవిడ్-19 ముప్పు కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరం ఒక్కటే కొవిడ్కు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి సమయంలో ఇప్పటికే తీవ్రమైన సమస్యలున్న వ్యక్తులు సరైన వైద్య పరీక్షలు, చికిత్స తీసుకోవడం లేదని నిపుణులు గుర్తించారు. ఫలితంగా వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ కొత్త లక్షణాలను అర్థం చేసుకోవడంతో పాటు ఇతర వ్యాధుల తీవ్రతపై సైతం శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ల కారణంగా లక్షణాల్లోనూ మార్పులు వస్తున్నాయని తెలిపారు.
కరోనా, కొత్త వేరియంట్లపై శాస్త్రవేత్తల బృందం పరిశోధిస్తున్నది. జోయి కోవిడ్ స్టడీ యాప్ డేటా ఆధారంగా.. ప్రస్తుతం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న చాలా మందిలో తలనొప్పి సమస్య కనిపిస్తుందని కనిపిస్తుంది. సాధారంగా కొవిడ్ సోకిన నుంచి ఉంటుందని, సాధారణంగా.. మూడు, ఐదు రోజుల మధ్య కూడా ఉంటుంది. అలాగే మోస్తరు నుంచి తీవ్రంగా జ్వరం ఉంటుంది. తలనొప్పి చాలా రోజులు నుంచి కొనసాగితే తీవ్రంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరిలో కండరాల నొప్పి సమస్య సైతం సాధారణంగా కనిపిస్తుందని తేలింది. ప్రత్యేకించి ఒమిక్రాన్ వెబ్లో విక్షలక్షణమైన లక్షణంగా పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తులు కండరాల నొప్పి ఉంటుందని, సమస్య నిరంతరం కొనసాగుతుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా భుజాలు, కాళ్లులో నొప్పి ఉంటుందని, కండరాల నొప్పితో పాటు విపరీతమైన అలసట, బలహీనంగా ఉంటుందని, ఈ లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నుంచి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని భావించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తులు సైతం వైరస్ సోకుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలంతా తప్పనిసరిగా తగిన కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించడం కొనసాగించాలని సూచిస్తున్నారు. అయితే, ఇన్ఫెక్షన్ నివారణలో టీకా పాత్ర ప్రత్యేకమైందని, తీవ్రమైన లక్షణాలు, మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.