Health Tips : పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతుంటారు. అయితే అదే పనిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుందని అయితే పండ్ల రసాల్లో ఫైబర్ చాలావరకూ కోల్పోతామని చెబుతున్నారు.
తాజా పండ్ల రసం తీసుకోవడం, పండును పూర్తిగా తీసుకోవడం వేర్వేరు ఫలితాలు ఇస్తాయని ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సంగీతా తివారీ వివరించారు. ఫైబర్ లేకపోవడంతో ఫ్రూట్ జ్యూస్ త్వరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. పండ్ల కంటే పండ్ల రసాల్లో అధిక క్యాలరీలుండటంతో పాటు చక్కెర అధికంగా ఉంటుంది.
పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే పండ్ల రసాల్లో కొన్ని పోషకాలు ముఖ్యంగా విటమిన్ సీ వంటివి జ్యూస్ తయారుచేసే ప్రక్రియలో కోల్పోతామని సంగీతా తివారీ తెలిపారు. పండ్ల రసాలతో పోలిస్తే పండ్లలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగించి అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధించడంతో పాటు మలబద్ధకం నివారించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
Read More :
Pandit Keshav Dev | మెడలో చెప్పులదండతో లోక్సభ అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఎందుకంటే..!!