ఘనాహారం ప్రారంభించిన తర్వాత, క్రమంగా వివిధ రకాల ఆహార పదార్థాలు ఇవ్వడం మంచిదే. కానీ మార్కెట్లో అమ్మే నిల్వ ఆహారంలో ఉప్పు, చక్కెర, కార్బొహైడ్రేట్లు ఎక్కువ. ఆ పరిమాణం కొంత తగ్గించే ప్రయత్నాలు జరిగినా ఇప్పటికీ పూర్తి సురక్షితం కాదు. కాబట్టి, పిల్లలకు పెట్టకపోవడమే ఉత్తమం. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మోయలేని భారం కూడా.
శిశువుకు తినిపించే ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఖర్చు తగ్గడమే కాదు.. సహజమైన రంగు, రుచి, వాసనతో తాజా రుచులు బిడ్డకు లభిస్తాయి. పిల్లల పెంపకం అనేది.. నైపుణ్యం, వ్యయప్రయాసలతో కూడిన బాధ్యత అని తల్లిదండ్రులు మర్చి పోవద్దు. అదనపు ఆహారం ప్రారంభించే వయసు శిశువు అభివృద్ధిలో ఒక మైలురాయి.
ఈ సమయంలో ఇచ్చే ఆహారం చిన్నారి భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. కృత్రిమమైన తిండిపై ఆధారపడటం అన్నది ఒక ఫ్యాషన్ స్థాయికి చేరుకున్నది నేడు. డబ్బాల్లోని రెడీమేడ్ ఆహారం ఇంట్లో వండే భోజనంతో ఏ విధంగానూ సరితూగలేదు. వాటిలో రంగులు, ఫ్లేవర్లు, ఎమల్సిఫయర్లు, స్టెబిలైజర్లు, బ్లీచ్లు.. ఇంకా ఎన్నో రసాయనాలు కలగలసి ఉంటాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో.. అప్పటికప్పుడు కలిపి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయన్న ఒకే ఒక్క కారణంతో జనం వాటిని ఎగబడి కొంటున్నారు.
పాశ్చాత్య దేశాలలో నిషేధించిన అనేక హానికర రసాయనా లను మన దగ్గర యథేచ్చగా ఉపయోగిస్తున్నారు. మూత సరిగా పెట్టక పోయినా, గడువు తేదీ పూర్తయినా.. ఆ ఆహారంలో బ్యాక్టీరియా, ఇతర క్రిమి
కీటకాలు చేరిపోయి విరేచనాలకు దారి తీయవచ్చు. కాబట్టి, ఇంటి ఆహారమే నూరుశాతం సురక్షితం.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డిపిల్లల వైద్య నిపుణులు, సికింద్రాబాద్.