హైదరాబాద్ : (Headache) తలనొప్పి ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు. ఓ తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకుని చాయ్ తాగి రెస్ట్ తీసుకోగానే తలనొప్పి మటుమాయమవుతుంది. అంతే! మళ్లీ బిజీగా పనుల్లో నిమగ్నమైపోతాం. నిజానికి తలనొప్పి అనేది.. తల, మెడ భాగాల్లోని సున్నిత ప్రాంతాల్లో, తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనుకావడం వల్ల లేదా వాపు రావడం వల్ల వస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు. ఇదే విషయాన్ని బేయర్స్ కన్స్యూమర్ హెల్త్ డివిజన్ నివేదిక కూడా స్పష్టం చేస్తున్నది. ఇదే సమయంలో భారత్లో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారిలో 60 శాతం మంది ఒత్తిడి కారణంగా తలనొప్పికి గురవుతున్నారని పేర్కొన్నది.
‘సరిడాన్ హెడ్డేక్ రిపోర్ట్’ పేరిట సమగ్ర నివేదికను బేయర్స్ కన్స్యూమర్ హెల్త్ డివిజన్ విడుదల చేసింది. 4 మెట్రో నగరాలు, టైర్1, 2 పట్టణాలతోపాటు 24 నగరాల్లో పదివేలకు పైగా మందిపై అధ్యయనం జరిపారు. 22-45 సంవత్సరాల మధ్య వయసు వారిపై ఈ అధ్యయనం చేశారు.
ఈ నివేదిక ప్రకారం, కొవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో 90 శాతం మంది ప్రజలు ఒత్తిడి కారణంగా తలనొప్పితో బాధపడినట్లు వెల్లడించారు. ప్రతి నలుగురిలో ఒకరు, ముఖ్యంగా పురుషులు ఒత్తిడిని కలిగి లేమని తలనొప్పిని దాచే ప్రయత్నం చేశారు. అలాగే, నాలుగు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే.. న్యూఢిల్లీలో నివసిస్తున్నవారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇదే సమయంలో భారత్లో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారిలో ఆర్థిక సమస్యలు లేదా పని ఒత్తిడి తరచుగా తలనొప్పికి కారణమని తేలింది. ఈ నివేదిక పట్టణ ప్రజలపై మహమ్మారి ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని బేయర్ కన్స్యూమర్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్ సందీప్ వర్మ తెలిపారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ‘హన్సా రీసెర్చ్’ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది.
డిపాజిట్పై ఎక్కువ వడ్డీ కావాలా? ఈ స్కీంలో చేరండి!
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
హర్యానా పాల్వాల్లో దారుణం.. ఒకే ఇంట్లో ఐదుగురి ఆత్మహత్య
నేను రాజీనామా చేయలేదు: ఓం ప్రకాశ్ సోని
గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..