యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంతో పాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.బాలాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక తిరుమంజనం జరిపారు.
అమ్మవారికి దివ్యాభరణాలు, నూతన క్షోమ వస్ర్తాలను దరింపజేసి దివ్యా భరణ శోభితంగా ఆస్థానంలో వేంచేపు చేయడం జరిగింది. బ్రాహ్మణులందరికీ ఆహ్వానించి ఋత్వి కరణం, విశ్వక్సేనార ధనలు, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో పాటు పారాయణాలు, జపాలు జరిపారు.
బాలాలయ ముఖ మండపంలో ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామార్చనతో పాటు స్వర్ణ పుష్పార్చన కైం కర్యాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం మంత్ర పుష్ప నిరాజనాలతో మూల నక్షత్ర పూజలు విశేషంగా చేపట్టారు. త్రికాలములయందు త్రిశక్తి స్వరూపురాలైన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి.
యాదాద్రి క్షేత్రంలో 100 ఏండ్లుగా అమ్మవారికి మూల నక్షత్ర పూజాదులు జరుపుతున్నట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లంధీఘల్ లక్ష్మీనారసింహచార్యులు తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నర సింహమూర్తి, ఏఈవోలు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.