మూడో సారి ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించడంతో ఆర్మూర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాల్గొన్నారు. కవిత పెర్కిట్ చౌరస్తాలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఏ ఫర్ ఆర్మూర్, ఏ ఫర్ ఆశన్నగారి జీవన్ రెడ్డి’ అని వ్యాఖ్యానించారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలపొంది జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని, రెండో సారి 30 వేల మెజారిటీతో ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి సీఎం కేసీఆ ర్ టికెట్ ఇచ్చారని, ఈ సారి కచ్చితంగా 60 వేల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. [gallery columns="1" size="full" ids="1224060,1224053,1224059,1224057,1224056,1224055"]