తాతను మించిన మనవడు అయ్యేట్టున్నాడు హిమాన్షు. మాటల్లోనే కాదు చేతల్లోనూ శహభాష్ అనిపించుకుంటున్నాడు.
కనీస వసతులు లేని ఓ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాడు.
2022లో తాను చదువుతున్న పాఠశాలలో క్లాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు క్లాస్ కో ఆర్డినేటర్ సూచనతో గౌలిదొడ్డి పాఠశాలను విజట్ చేశానని హిమాన్షు వివరించాడు.
తాను చదువుతున్నస్కూల్ చేపట్టిన సేవకార్యక్రమంలో భాగంగా హిమాన్షు గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను మొదటి సారిగా విజిట్ చేశాడు.
గౌలిదొడ్డి స్కూల్ను మొదటిసారి సందర్శించినపుడు దాని పరిస్థితి చూసి చలించి పోయాడు. ఇందులో చదివే పిల్లలకు ఎట్లైనా న్యాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు.
ఫండ్స్ లేకపోయినా వెనకడుగు వేయలేదు. ఆ స్కూల్ రూపురేఖలు పూర్తిగా మార్చేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకుని సుమారు కోటి రూపాయలవరకు ఫండ్స్ సేకరించాడు.
2022లో తాను చదువుతున్న పాఠశాలలో క్లాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు క్లాస్ కో ఆర్డినేటర్ సూచనతో గౌలిదొడ్డి పాఠశాలను విజట్ చేశానని హిమాన్షు వివరించాడు.
ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్ను విజిట్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని స్టడీ చేశాడు. రాత్రి సమయాల్లో వచ్చి కూడా పనులను పర్యవేక్షించినట్లు హిమాన్షు చెబుతున్నాడు.
ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్ను విజిట్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని స్టడీ చేశాడు. రాత్రి సమయాల్లో వచ్చి కూడా పనులను పర్యవేక్షించినట్లు హిమాన్షు చెబుతున్నాడు.
అందరి సహకారంతో పేద పిల్లల బడిని పెద్ద బడి చేశాడు. సకల హంగులు సమకూర్చి తన పుట్టిన రోజునాడు ఆ పిల్లలకు బహుమతిగా ఇచ్చాడు.
అప్పడు ఆ పిల్లల కళ్లల్లో ఆనందాన్ని చూశాడు. స్కూల్ ప్రారంభం సందర్భంగా హిమాన్షు మాట్లాడుతున్నపుడు అతని కళ్లల్లో తడి కనిపించింది.
తన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న స్కూల్ ఆవరణంతా సంతోషంగా కలియదిరిగాడు. పిల్లలతో కాసేపు సరదాగ ఆడుకున్నాడు.
కేరింతల గోల మధ్య ఎంజాయ్ చేశాడు. వారితో ముచ్చటించాడు.
వారితో పాటే కలిసి భోజనం చేశాడు.
పేద పిల్లలకోసం హిమాన్షు చేసిన గొప్ప పనిని మెచ్చుకుంటూ స్కూల్ సిబ్బంది, పిల్లలు కలిసి సన్మానించారు.
విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు హిమాన్షును పొగడ్తల్లో ముంచెత్తారు.
ఇంత మంచిపని చేయడానికి తాత కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకున్నానని, నాన్న కేటీఆర్ ఆశీస్సులు అందించారని హిమాన్షు చెప్పారు.
స్కూల్ గురించి హిమాన్షు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పడు అంతా హిమాన్షు గురించే మాట్లాడుకుంటున్నారు.
తాతను మించిన తనయుడు అని, భవిష్యత్ పీఎం అని, కల్వకుంట్ల వంశంలో మరో ఆణిముత్యం అని, తాతను, తండ్రిని ఇద్దరినీ మించిపోయేలా ఉన్నాడని నెటిజనులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇదంతా చేయడానికి తాత కేసీఆరే స్ఫూర్తి అని, పేదరికాన్ని అరికట్టే ఉపాయం చదువుకున్న సమాజానికి ఉంటుందని తాత చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు.
వంద మందికి మంచి చేసే అవకాశం ఉంటే చేయాలని నాన్న కూడా అని ప్రోత్సహించారని చెప్పాడు.
ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ పేదవారు. కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు చెందినవారే. ఈ స్కూల్ పిల్లల్లో ఫ్యూచర్లో ఇంజినీర్లను, డాక్టర్లను, లాయర్లను చూడాలి. మీలో పొలిటిషీయన్లను చూడాలి.
తప్పకుండా అండగా ఉంటాం అని హిమాన్షు పేద పిల్లలకు భరోసా ఇచ్చాడు.