యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగాయి. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.