హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ శుక్రవారం మొదలైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెయిలింగ్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఆసియా గేమ్స్కు (2022) సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీకి తొలిసారి జాతీయ యాచింగ్ సమాఖ్య(వైఏఐ) గుర్తింపునిచ్చింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి 120 మందికిపైగా సెయిలర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.