ఉప్పల్, జూన్ 15: ప్రభుత్వం అందించే కరోనా టీకా ను సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్లోని ప్రభుత్వ పాఠశాలలో పొదుపు సంఘాల మహిళలకు మంగళవారం ప్రత్యేకంగా టీకాలను వేశారు. టీకా కేంద్రాన్ని ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, కార్పొరేటర్ రజిత పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు టీకాలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ అశోక్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, లక్ష్మణ్, జైకృష్ణ, హనుమాన్దాస్, శేఖర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, జడ్సీ ఉపేందర్రెడ్డి, కార్పొరేటర్ రజిత పర్యటించారు. నల్లచెరువు ప్రాంతం సాయిబాబా ఆలయ సమీపంలోని ఆక్రమణలను, అనంతరం కూరగాయల మార్కెట్లోని వర్షపునీటి నిల్వ, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. న్యూశాంతినగర్లో నాలా పూడికతీత పనులను పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, కాలనీవాసులు వెంకటేశ్గుప్తా, శేఖర్గౌడ్, నవీన్, గౌరీశెట్టి శ్రీను, రామకృష్ణ పాల్గొన్నారు.
ప్రొ సేవా సంఘటన్, అపోలో హాస్పిటల్, జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రశాంతినగర్ కమ్యూని టీ హాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ మేరకు 32 కాలనీల్లోని 276 మందికి టీకా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షుడు అనీశ్సింగ్, ఉపాధ్యక్షుడు మహేశ్, ప్రధాన కార్యదర్శి పర్వేశ్సింగ్, శ్రీనివాస్శర్మ, ప్రదీప్, సతీశ్, భరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో స్వయం స్వశక్తి సహాయక సంస్థ ప్రతినిధులు, సభ్యులకు ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో మల్లికార్జున్, డాక్టర్ పూజ, డీసీ శంకర్, పీవో ఇందిర, సిబ్బంది, మహిళా సమాఖ్య కాప్రా పట్టణ అధ్యక్షురాలు, మల్లాపూర్ ఇన్చార్జి ఉర్మిళ, సుశీల, సురేఖ, కో-ఆర్డినేటర్లు వెంకటేశ్, సహదేవ్, వాణి, పుష్పలత, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పల్లా కిరణ్కుమార్రెడ్డి, హమాలీ శ్రీనివాస్, నెమలి రవి, సానాల రవి, కర్నె మల్లేశ్, శ్రావణ్ పాల్గొన్నారు.
మల్లాపూర్: మల్లాపూర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ భవనంలో మంగళవారం అరెజన్ లైఫ్ సైన్సెస్ (జీవీకే బయో) వారి ఆధ్వర్యంలో కొవిడ్ టీకా కేంద్రాన్ని వైస్ ప్రెసిడెంట్ రమేశ్ గంబీర్ ప్రారంభించారు. మంగళవారం సుమారు 450 మంది ఉద్యోగులు టీకా వేసుకున్నారని ఐలా అధ్యక్షుడు కిషన్చంద్ర తెలిపారు. ఐలా సెక్రటరీ రోహిత్, వైస్ ప్రెసిడెంట్ కిరణ్రెడ్డి, కోశాధికారి ఎస్ఆర్కే రాజు, జాయింట్ సెక్రటరీ సురేశ్, చైర్మన్ మహేందర్రెడ్డి, సెక్రటరీ డి.శ్రీనివాస్, కమిషనర్ విజయ పాల్గొన్నారు.