బలమైన పార్టీగా టీఆర్ఎస్
గ్రేటర్లో 46 శాతం ఓట్లు
24 శాతం వద్ద ఆగిన బీజేపీ
14 శాతానికే కాంగ్రెస్ పరిమితం
కొవిడ్ కారణంగా తగ్గిన పోలింగ్
వృద్ధులు, మహిళలు ఓటింగ్కు దూరం
పోలైన ఓట్లలో సింహభాగం అధికార పార్టీ సొంతం
వరంగల్, మే 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేట ర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గులాబీ బలం పెరిగింది. వరుసగా రెండోసారి తిరుగులేని మెజారిటీ తో టీఆర్ఎస్ గెలిచింది. దాదాపు ఏడేండ్లుగా చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు టీఆర్ఎ స్కు ఏక పక్ష విజయాన్ని అందించాయి. కార్పొరేషన్ లోని 66 డివిజన్లలో కలిపి 6,64,188 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,65,663 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 46.63 శాతం మంది టీఆర్ఎస్కు ఓటు వేశారు. మొత్తం ఓట్లలో 1,70, 49 3 మంది ఓటర్లు గులాబీ పార్టీకి మద్దతు తెలిపారు. అ త్యధిక ఓట్లతో 48 డివిజన్లలో గెలిచింది. టీఆర్ఎస్ ఓ టింగ్తో పోలిస్తే సగం వరకు మాత్రమే బీజేపీకి పో లయ్యాయి. 24.16 శాతం ఓటింగ్ నమోదైంది. మొ త్తం 88,339 మంది ఆ పార్టీకి ఓటు వేశారు. మొ త్తంగా బీజేపీ 10 డివిజన్లను గెలిచింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కేవలం 14.06 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 45, 391 ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోల్ కాగా, నాలుగు స్థానాల్లో గెలిచింది. టీఆర్ఎస్లో టికెట్ల కోసం పోటీ కారణంగా సామాజిక సమీకరణలో అవకాశం రాకపో యిన వారు స్వతంత్రులుగా పోటీ చేశారు. వీరిలో నలుగురు గెలిచారు. స్వతంత్రులు అన్ని డివిజన్లలో కలిపి కాంగ్రెస్కు దాదాపు సమానంగా 12.41 శాతం ఓట్లు పొందారు. వీరికి 45,391 ఓట్లు వచ్చాయి. గ్రేట ర్ వరంగల్ నగరంలో విద్యావంతులైన ఓటర్లు ఎక్కు వగా ఉంటారు. అయినా పోలైన మొత్తం ఓట్లలో 1.16 శాతం అంటే 5,985 ఓట్లు చెల్లలేదు. నోటాకు 1.10 శాతం అంటే 4.027 ఓట్లు పోలయ్యాయి. పో స్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 1545 పోస్టల్ ఓట్లలో 674 ఓట్లు టీఆర్ఎస్కు పోల య్యాయి. అన్ని వర్గాలూ గులాబీ పార్టీకి మద్దతు ఇచ్చి నట్లు ఓటింగ్ తీరుతో స్పష్టమవుతోంది. గ్రేటర్ వరం గల్ ప్రజలు మరోసారి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతు తెలిపారు.
కలిసికట్టుగా ఘన విజయం..
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా వ్యూహం తో విజయం సాధించింది. అభివృద్ధి ఎజెండాతో ఎన్నికల్లో గెలిచింది. 2014 నుంచి వరంగల్ మహా నగరంలో రూ.4,126 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, పోలింగ్ వ్యూహం అన్నింట్లో సమష్టిగా ముందుకు సాగింది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి, టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి గ్యాదరి బాలమల్లు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లతో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, రాజయ్యతో కలిసి సమన్వయ కమిటీ అభ్యర్థుల ఎంపిక నుంచి అన్నీ తానై వ్యవహరించింది. డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచా రం సేకరించి గెలుపు కోసం వ్యూహాలను రచించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఇతర నాయకులకు సమన్వయ కమిటీ డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించింది. బీజేపీ, కాంగ్రెస్ అయోమయ మాటలు, పిచ్చి విమర్శలను పట్టించు కోకుండా ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహానగరం అభివృద్ధిని వివరించారు. అన్ని ప్రక్రియలోనూ సమష్టి వ్యూహంతో టీఆర్ఎస్ మరో సారి ఘన విజయం సాధించింది.