నర్సాపూర్,ఏప్రిల్ 26: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.కరోనా కట్టడికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ ఏరియా దవాఖానలో వివిధ శాఖల అధికారులతో కరోనా కట్టడిపై ఆర్డీవో రవీందర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిఫ్యూటీ డీఎంహెచ్వో విజయనిర్మల, ఇన్చార్జి తహసీల్దార్ తిరుమల్రావు, ఎస్సై గంగరాజు, దవాఖాన సూపరింటెండెంట్ మిర్జా నజీమ్, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ పాల్గొన్నారు
కొల్చారం..
కొల్చారం, ఏప్రిల్ 26: కరోనా వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వేయడానికి ఏర్పాట్లు చేయాలని మండల ప్రత్యేకాధికారి బాబూనాయక్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి బాబూనాయక్ మాట్లాడుతూ మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారందరికి టీకాలు వేసేందుకు గ్రామాల్లో క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీవో ప్రవీణ్కుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంఈవో నీలకంఠం, మండల వ్యవసాయాధికారి బాల్రెడ్డి, ఏపీఎం సుసిల్వ, కొల్చారం మెడికల్ ఆఫీసర్ రమేశ్, రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్వో సుదర్శన్ పాల్గొన్నారు.
చేగుంట…
చేగుంట, ఏప్రిల్ 26: నార్సింగి ఆరోగ్యకేంద్రం పరిధిలోని నర్సంపల్లిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, ఎంపీడీవో ఆనంద్మేరీ పరిశీలించారు.
చేగుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమసత్యనారాయణతో పాటు పలువురు కరోనా టీకా వేసుకున్నారు.
మనోహరాబాద్…..
మనోహరాబాద్, ఏప్రిల్ 26 : మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీలో కరోనా వ్యాక్సిన్ గ్రామస్తులకు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి ,ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకుడు
చంద్రశేఖర్ ముదిరాజ్, రైతు బంధు మం డల కో ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
చిలిపిచెడ్….
చిలిపిచెడ్, ఏప్రిల్ 26: మండల పరిధిలోని గంగారం, ఫైజాబాద్ గ్రామాల్లో కరోనా వ్యాక్సిన్ 600 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఎంపీడీవో శశిప్రభ తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మమతబాబు, మనోహరనర్సింహారెడ్డి, ఎస్ఐ మల్లారెడ్డి, ఎంపీవో పోలేశ్వర్రాజు, ఏపీవో శ్యామ్కుమార్ పాల్గొన్నారు.
కొల్చారం..
కొల్చారం, ఏప్రిల్ 26: అంకితభావంతో వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి అన్నారు. కిష్టాపూర్లో కొల్చారం ప్రాథమి క ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రమేశ్ ఆధ్వర్యంలో కరోనా టీకా వేశారు.