కొండాపూర్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనల్లో పలువురు నృత్యకారులు శ్రీకృష్ణుడి ప్రత్యేక పాటలకు కూచిపూడి నృత్యరూపకంలో నర్తించిన తీరు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుడు చేసిన చిలిపి అల్లరులను అందమైన అభినయంతో నృత్యకారులు ప్రదర్శించిన తీరు అలరించింది.
అభినయవాణి నృత్య నికేతన్ గురువులు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కుమార్తె బాలత్రిపుర సుందరి శిష్య బృందం ప్రదర్శించిన గణపతి గీతం, దశావతారం, వసంత స్వర జతి, నారాయణీయం, ముద్దుగారే యశోద, కోలాటం, తారంగం అంశాలను కూచిపూడి నృత్య రూపకంలో నర్తించి ఆకుట్టకున్నారు. కళాకారులు సౌమ్య, భువనరెడ్డి, శ్రీయ, శ్రీనివాస్, అద్వైత, మోక్ష, భావన, కృష్ణ ప్రియా, కాత్యాయనిలు ప్రదర్శనలిచ్చారు.