న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూసెట్ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 15, 16, 23, 25 తేదీల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశపరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నది.
కాలేజీలు:
అస్సాం యూనివర్సిటీ, సిల్చార్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ గుజరాత్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ హర్యానా
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ జార్ఖండ్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటక
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కేరళ
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ పంజాబ్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ రాజస్థాన్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ సౌత్ బీరార్
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ తమిళనాడు
నోట్: హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 1
వెబ్సైట్: cucet.nta.nic.in, nta.ac.in