అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు వెలువడ్డాయి. ఐసెట్ కోసం మొత్తం 42 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 38 వేల మంది ప్రవేశ పరీక్ష రాశారు. అందులో 91.27 శాతం మంది ఐసెట్కు అర్హత సాధించారు. ఐసెట్ ప్రవేశపరీక్షను సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించారు.
అదేవిధంగా ఈసెట్ పరీక్షను 32,318 మంది రాయగా, 29,904 మంది (92.53 శాతం) విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ప్రవేశపరీక్ష జరిగిన 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ను సెప్టెంబర్ 19న నిర్వహించారు. ఈసెట్ ద్వారా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఫలితాల కోసం sche.ap.gov.in/ICET/, https://sche.ap.gov.in/ వెబ్సైట్లు చూడవచ్చు.