హీరోల ఆదాయాలు, వారు తీసుకునే పారితోషికాలపై సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని అన్నారు దర్శకుడు రామ్గోపాల్వర్మ. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల కథానాయకుల విలువ పడిపోదని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ ‘బాహుబలి’ తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి దర్శకుడు రాజమౌళి తీసుకెళ్లారు. మన సినిమాల రెవెన్యూను రెట్టింపు చేశారు. వందల కోట్లతో తీసిన సినిమా..కోటి రూపాయలతో తీసిన సినిమా టికెట్ను ఒకే ధరకు అమ్మడం అన్యాయం. ఏ వస్తువును ఎంత ధరకు కొనాలన్నది కొనుగోలుదారుడు, అమ్మకందారుడికి మధ్య ఉండే అవగాహన, అభిరుచులు, స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల సినిమా బడ్జెట్లు, ప్రమాణాలు పడిపోతాయి. నిత్యావసర వస్తువులతో సినిమా మాధ్యమాన్ని పోల్చడం సరికాదు. ప్రేక్షకులపై భారం పెరుగుతుందనే ఆలోచనతో టికెట్ల రేట్లను తగ్గిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పడంలో అర్థంలేదు. టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల హీరోల పారితోషికాలు తగ్గవు. హీరోలు లేకపోతే సినిమాలు లేవు. వారిని చూడటానికే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారు’ అని తెలిపారు.