‘నేను సైకాలజీ చదివాను కాబట్టి మనుషుల వ్యక్తిత్వం గురించి త్వరగా అర్థం చేసుకోగలను. జీవితంతో పాటు సినీరంగంలో రాణించడానికి సైకాలజీ ఉపయోగపడుతున్నది’ అని చెప్పింది కన్నడ సోయగం కృతిశెట్టి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్కృష్ణ కురసాల దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. మంగళవారం కృతిశెట్టి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను గ్రామసర్పంచ్ పాత్రను పోషించా. మైక్ పట్టుకొని ప్రసంగాలు చేయడం కొత్తగా అనిపించింది. నా పాత్ర అమాయకత్వం, అల్లరితనం కలబోతగా నవ్వుల్ని పంచుతుంది. ‘ఉప్పెన’ సినిమా టైంలోనే తెలుగు గ్రామీణ సంప్రదాయాల గురించి అవగాహన పెంచుకున్నా. ‘బంగార్రాజు’ ద్వారా మరిన్ని విషయాల్ని తెలుసుకునే అవకాశం దొరికింది. నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సన్నివేశాల్లో నటిస్తా. పాత్ర స్వభావం గురించి బాగా అర్థం చేసుకొని లీనమైపోతా. కథల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటున్నా. నా కెరీర్ ఉన్నతికి దోహదపడే పాత్రల్నే ఎంపికచేసుకుంటున్నా’ అని చెప్పింది.