చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో ప్రీ లుక్ పోస్టర్ను విడుదలచేశారు. ఈ పోస్టర్లో ైస్టెలిష్లుక్లో చిరంజీవి కనిపిస్తున్నారు. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. భోళాశంకర్గా చిరంజీవి పాత్ర మాస్, క్లాస్ వర్గాల్ని అలరించేలా ఉంటుంది. చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ నటిస్తున్నది. ఇటీవలే కీలక షెడ్యూల్ను పూర్తిచేశాం’ అని చిత్రబృందం తెలిపింది. రఘుబాబు, రావురమేష్, మురళీశర్మ, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్; సినిమాటోగ్రఫీ: డూడ్లె.