న్యూఢిల్లీ: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ను సీబీఎస్సీ విడుదల చేసింది. 15వ ఎడిషన్ సీటెట్ రిజిస్ట్రేషన్లు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది. బీఈడీ చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు రూ.500. రెండు పేపర్లకు అయితే రూ.1200, రూ.600.
రిజిస్ట్రేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 19
వెబ్సైట్: ctet.nic.in