తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నవ వసంతాల పాలనను పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ప్రాంతీయ పార్టీ హోదా నుంచి దేశం వైపు అడుగులు వేస్తూ అఖిల భారత పార్టీగా ఎదుగుతున్నది. ఇప్పటికే అనేక రాష్ర్టాల నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ‘అబ్ కీ బార్..కిసాన్ సర్కార్’ నినాదం దేశమంతటా మారుమోగుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని రాష్ట్రం వెలుపల విస్తరించడాన్ని రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) జీర్ణించుకోలేకపోతున్నాయి. భారత రాష్ట్ర సమి తి ఇతర రాష్ర్టాల్లో బలపడితే తమకు నష్టం వాటిల్లుతుందని భయపడుతూ అసందర్భ ప్రకటనలు, అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి.
త్వరలో జరిగే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం సార్వత్రిక ఎన్నికలను దృష్టి లో ఉంచుకొని అటు ఢిల్లీలోఎన్డీఏ మిత్రపక్షా లు , ఇటు బెంగళూరులో కాంగ్రెస్ మిత్రపక్షాల సమావేశాలు ఇటీవల పోటాపోటీగా జరిగాయి. 38 పార్టీలు ఢిల్లీకి, 26 పార్టీలు బెంగళూరుకు వెళ్ళాయి. దేశంలోని ఆరు పార్టీలు మాత్రం ఏ సమావేశానికి వెళ్లలేదు. ఆహ్వానం అందితే బీఎస్పీ, టీడీపీ, జేడీఎస్లు ఎటో ఒకవైపు వెళ్ళేవే మో. కానీ, ఆహ్వానం అందినా వెళ్లకూడదని భావించిన పార్టీలు బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ. పిలిచినా పిలవకపోయినా ఒకటే అని అనుకు న్న పార్టీ బీజేడీ. ఏదేమైనా అటు ఇండియా కూటమి నుంచి గానీ, ఇటు ఎన్డీఏ నుంచిగానీ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల (మాయావతి, చంద్రబాబు, కుమారస్వామి)కు, ముగ్గు రు ముఖ్యమంత్రులకు (కేసీఆర్, జగన్, నవీన్) పిలుపు రాలేదు.
నిజానికి విపక్షాల ఐక్యత కోసం తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ నిజాయితీగా కృషి చేశారు. అందరికంటే ముందే అన్ని రాష్ర్టాలు తిరిగారు. ఉద్ధ వ్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, మమత, అఖిలేశ్, నితీశ్, లాలూ, నవీన్, స్టాలిన్, కుమారస్వామి తదితరులను కలిసి థర్డ్ ఫ్రంట్ ఆవశ్యకతను వివరించారు. ఆ తర్వాత వీరిలో కుమారస్వామి, నవీన్ పట్నాయక్లు తప్ప అందరూ కాంగ్రెస్ పంచన చేరారు. ఈ పరిణామాలు కేసీఆర్ ఆత్మైస్థెర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఎందుకంటే, సమకాలీన రాజకీయాల్లో ఆయన ఓ విలక్షణమైన నాయకుడు. పట్టువదలని విక్రమార్కుడు.
సంచలనాలకు మారుపేరు కేసీఆర్. ఆయన ఏదీ ఆషామాషీగా చేయరు. జాతీయ రాజకీయాలను మలుపు తిప్పేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చడంలోనూ, దాన్ని దేశమంతటా విస్తరించాలనుకోవడంలోనూ ఆయన వ్యూహం ఆయనకున్నది.
అనూహ్యమైన ఎత్తుగడలతో ఎదుటివారిని ఉక్కిరిబిక్కిరి చేయడంలో, ప్రత్యర్థులకే ఎజెండా నిర్ణయించడంలో కేసీఆర్ ముందుంటారు. అది రాజకీయమైనా, పాలనా పరమైనదైనా, విధాన పరమైనదైనా కేసీఆర్ తర్వాతే ఎవరైనా.
దేశంలో గుణాత్మకమార్పు అనే ఆశాజనకమైన ఆలోచనను, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే ఆకర్షణీయమైన నినాదాన్ని అందరికంటే ముందుగా ఆయన ప్రకటించారు. గుణాత్మకమార్పు అనే యోచన దేశంలోని బుద్ధిజీవుల మెదళ్లలో కదలిక తెప్పించగా, అబ్ కీ బార్ కిసా న్ సర్కార్ అనే విలక్షణ నినాదం అన్ని రాష్ర్టాల్లోని రైతుల, రైతు కూలీల కండ్లల్లో కొత్త కాంతి ని తీసుకు వచ్చింది. అందుకే అనేక రాష్ర్టాల్లోని రైతు ఉద్యమ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నా రు. మహారాష్ట్ర నుంచి పలువురు నేతలు ము ఖ్యంగా ప్రస్తుత ప్రజాప్రతినిధులు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు. అక్కడ నిర్వహించిన పలు సభలు కూడా విజయవంతమయ్యాయి. ఈనెల ఒకటిన మరోసారి ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్ళివచ్చారు కేసీఆర్. ప్రస్తుతం అక్కడున్న రాజకీయాల దృష్ట్యా బీఆర్ఎస్ గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి.
మహారాష్ట్రలో చాలా కాలం మిత్రపక్షాలుగా ఉన్న శివసేన -బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడిపోగా, ఇటీవల శివసేన, ఎన్సీపీలు నిట్టనిలువుగా చీలి బీజేపీతో జత కట్టాయి. దీంతో అక్కడ ఆయా పార్టీలు బలహీనపడ్డాయి.
మహారాష్ట్రతో పాటు బీఆర్ఎస్ త్వరలో యు.పీ, మధ్యప్రదేశ్, బీహార్,జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో కూడా ప్రాబల్యం పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి రెం డు కారణాలు. ఆయా రాష్ర్టాల్లో వనరులున్నప్పటికీ నేతల పనితీరు బాగాలేకపోవడం ఒకటయి తే, తెలంగాణలో కేసీఆర్ అనుసరిస్తున్న పాలనావిధానం ఇంకొకటి.
కాగా, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను బూచిగా చూపి (దుర్వినియోగపరచి) వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చే , పార్టీలను చీల్చే పనిని బీజేపీ విజయవంతంగా అమలు చేస్తున్నది. బీజేపీ ఇంతపచ్చిగా, ఇంత నిర్లజ్జగా పార్టీలను చీ ల్చుతుంటే తట్టుకుని నిలబడగలిగింది ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు కేసీఆర్, మరొకరు నితీశ్. బీహార్లో తన పార్టీని చీల్చేందుకు జరుగుతున్న యత్నాలను ముందుగానే గమనించి నితీశ్ బీజేపీకి గుడ్బై చెప్పి ఆర్జేడీతో కలసి సర్కార్ను నిలబెట్టుకున్నారు. ఇక తెలంగాణలో ఎంఎల్ఏల కొనుగోలు యత్నాలను ఆదిలోనే అడ్డుకుని దోషులను రెడ్ హ్యాండెడ్ గా సమా జం ముందు నిలబెట్టి బీజేపీకే షాకిచ్చిన ఘటికుడు కేసీఆర్. అంతేకాక బీజేపీపై యుద్ధం ప్రకటించి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేశారు.అయితే కేసీఆర్కు విపక్ష కూటమి నుం చి ఆహ్వానం రాకపోవడానికి కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగే కారణమని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఎన్డీఏ కూటమిలో ఉన్న 38 పార్టీలన్నీ చిన్నాచితకవి. పెద్దన్న బీజేపీ చెప్పినట్టు వినవలసిందే. ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకోవాల్సిందే. బేరాలాడే పరిస్థితి ఉండదు. ఇందుకు పూర్తి విరుద్ధం ఇండియా కూటమి. ఈ కూటమిలో కాంగ్రెస్ది మైనారిటీ రోల్ మాత్రమే. బలమైన మిత్రపక్షాలు ఆయా రాష్ర్టాల్లో ఎన్ని సీట్లు విదిలిస్తే వాటితోనే తృప్తి పడవలసిందే. డిమాండ్ చేసే స్థితిలో అది లేదు.
ఇక ఢిల్లీ, యూపీ, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్లలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా లేదు కాబట్టి ఆయా నేతలు బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలోనే ఉం టారు. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందు కే ఏదో ఒక కూటమిలో చేరి సీట్లు త్యాగం చేయడమో, సీట్లు అడుక్కోవడమో కాకుండా స్వ యంప్రతిపత్తిని కాపాడుకోవడమే మేలు. సీఎం కేసీఆర్ ఈ దిశగానే యోచిస్తున్నారు. ఈ ఆలోచనతో కలసివస్తే బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేడీ, జేడీఎస్లతో ప్రత్యామ్నాయ కూటమి నేతగా కేసీఆర్ ముందుంటారు. ఆ రెండు కూటములు నచ్చని పార్టీలు, మేధావు లు, తటస్థులు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతారు. ప్రత్యామ్నాయశక్తిగా, ఆశాజ్యోతిగా బీఆర్ఎస్ విరాజిల్లుతుంది.
దేశాన్ని సమూలంగా మార్చాలన్న వినూత్నమైన ఆలోచనా విధానంతో, విలక్షణమైన ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్న బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో ఉజ్వలభవిష్యత్ ఉంటుంది. భారత రాష్ట్ర సమితి సొంత అస్తిత్వాన్ని నిలబెట్టుకుని జాతీయ స్థాయిలో సత్తా చూపడం ఖాయం.
-కె. సతీశ్చంద్ర
99082 12563