పల్లవి: అమరవీరుల త్యాగమై మోగింది గానం
ఆశయాల రూపమై వెలిగింది తెలంగాణం
ప్రగతి దారులెంట పయనించే విజ్ఞానం
ప్రగతికి ప్రణమిల్లిరి జన ప్రభంజనం
చరణం: స్వేదంలో వేదమై వెల్లివిరిసె సంబురం
ఎనిమిదేళ్ల తెలంగాణ వికసించిన అంబరం
తొలిపొద్దు పొడుపులో ఎరుపెక్కిన మందారం
తొలిపోరు బాటలో సీఎమ్మే సింధూరం
చరణం: మిషన్ కాకతీయతో పూడికలను తీయించి
జలదారల పుష్పాలతో అభిషేకం చేయించి
అపర భగీరథుడివి అయ్యావా ఓ అన్నా..
నీ ఆత్మీయ పాలనే దీప్తినొందు ఓరన్నా..
॥అమర వీరుల॥
చరణం: రైతుబంధు చేయూతగా హరితవనం పయనించే
అడుగడుగున జనవాణి హర్షంబులు వినిపించే
ఖిల్లాలపై కీర్తి కిరణ బావుటాలను ఎగరేసి
జిల్లాలపై స్ఫూర్తి చరణ భావుకతలను చల్లేసి
తిరుగులేని ఆయుధంగ నిలిచావా ఓరన్నా..
॥అమర వీరుల॥
చరణం: కష్టాలను కడతేర్చే స్నేహ ప్రభుతకు స్వాగతం
ఇష్టాలను సమకూర్చే నాయకుడికి వందనం
మన ఊరు మన బడి మా జిల్లా మా రాష్ట్రం
మమకారపు గొలుసు కట్టి.. మంచితనం ఒడిసిపట్టి
కార్యాలను కలిసికట్టి.. వర్ధిల్లెను మనసు పెట్టి
అదిగదిగో సంబురాల తెలంగాణ
గ్రీష్మంలో సేదవోలే సంతోషపు పూలవాన
॥అమర వీరుల॥
– డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327