భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనవర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఎనిమిదేండ్లలోనే తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపి నిలువెత్తు సంక్షేమరూపంగా నిలిచారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ నినాదాన్ని అక్షరాల పాటిస్తూ కోటి ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అందులో ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు, తాగు నీరు అందిస్తున్నారు. అప్పు చేసి రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడని గ్రహించిన కేసీఆర్ రైతుబంధు ద్వారా పంటకు పెట్టుబడి అందించి వారిని ఆదుకుంటున్నారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రూ.5 లక్షలతో రైతు బీమాను అమల్లోకి తీసుకువచ్చారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఎరువులు, విత్తనాలను రైతులకు అందిస్తున్నారు.
రైతు వేదికలు నిర్మించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులకు నెలకు రూ.2016, వికలాంగులకు రూ.3016 ఆసరా పింఛన్లతో వారికి జీవన భద్రత కల్పిస్తున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించాలని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఒక లక్షా పదహార్లతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక పేద ప్రజలందరికీ రూపాయికి కిలో బియ్యం, అమ్మ ఒడి ద్వారా గర్భవతులైన మహిళలకు పౌష్ఠికాహారం, ప్రసవానంతరం తల్లి బిడ్డకు 16 వస్తువులతో కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు,ఆరోగ్యశ్రీ, 108,104 వంటి వాటితో ప్రజా వైద్యాన్ని అభివృద్ధి చేయ టం గమనార్హం. కంటి సమస్యలతో బాధపడేవారికి ‘కంటివెలుగు’ ద్వారా ఉచిత కంటిపరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు పంపిణీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేశారు. ఈ రంగంలో మౌలిక వసతులు కల్పించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని రూపొందించారు.
కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుచూపుతోనే మొదలుపెడుతారు. అందులో భాగంగా నే దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని 10 లక్షల ఆర్థిక సహాయంతో ‘దళిత బంధు’ తెచ్చా రు. గిరిజనుల రాజకీయాభివృద్ధి కోసం తండా లు, ఆదివాసి గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. అన్నివర్గాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టారు. వైతాళికుల సేవలను గుర్తుచేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మహామహుల పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలా ల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో బీసీ గురుకులాల ద్వారా అద్భుతమైన విద్యనందిస్తున్నారు. పోరాటయోధులైన సర్వాయి పాపన్న, కుమ్రంభీం, చాకలి ఐలమ్మల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారంగా నిర్వహిస్తున్నారు.
కులవృత్తులకు పూర్వవైభ వం తీసుకువచ్చే దిశగా గొర్రెల పంపిణీ ద్వారా గొల్ల కురుమల, చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపారు.చేనేత కార్మికుల రుణాలను మాఫీచేశారు.వారికి సబ్సి డీ యంత్రాలు ఇచ్చారు. బతు కమ్మ చీరలతో చేతినిండా పని కల్పించారు. సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నుంచి తలెత్తుకొని బతికేలా నేతన్నల జీవితాలను తీర్చిదిద్దారు.
నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూ నిట్లు, అలాగే దళితులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమలు చేస్తున్నారు. మేదరి, వడ్డెర, విశ్వకర్మ, గౌడ తదితర కులవృత్తుల వారందరికీ ఆర్థిక సహకారం అందించి వృత్తి పరికరాలు పంపిణీ చేశారు. కల్లుగీత, మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించారు. అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏటా రూ.1000 కోట్లతో ప్రత్యేక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. ఇలా వందలాది సంక్షేమ పథకాలతో పేదల పాలిట పెన్నిధి లా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుస్తున్నారు. ఒక్క రూపాయి కొత్త పన్నులు వేయకుండా సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందించారంటే కేసీఆర్ దార్శనికత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని అనేక పథకాలను సైతం కేసీఆర్ అమలుచేసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. అందు కే యావత్ దేశం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నది.
డాక్టర్ బొల్లికొండ వీరేందర్: 98665 35807 (వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)