ఉమ్మడి రాష్ట్రంలో గడచిన అరవై ఏండ్లుగా పడావుగా ఉన్న భూమి స్వరాష్ట్రంలో సాగుకు నోచుకున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసాగా 2018లో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దీనికి ఊపిరిపోసింది. ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలోనూ అమలైన దాఖలా లేదు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనల నుంచి ఉద్భవించిన మానస పుత్రిక రైతుబంధు. రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు ప్రతి ఎకరాకు పదివేల చొప్పున రైతుబంధు అందుతుండగా, వచ్చే ఐదేండ్లలో ఎకరాకు రూ.16 వేలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వ్యవసాయ రంగ మే కీలకం. ఇందులో ముఖ్యంగా సాగునీరు చాలా అవ సరమైన అంశంగా పరిగణలోనికి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయలో భాగంగా పూడుకుపోయిన వేలాది చెరువులను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకువచ్చారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు నిర్మించి కాలువల ద్వారా చెరువులన్నీ నింపడంతో పాటు అనేక చిన్న, పెద్ద రిజర్వాయర్లను నిర్మించడంతో గ్రామాల్లో నీటి వసతి పెరిగింది. భూగర్భ జలాలు పెరుగడంతో ఒకప్పుడు పాడుబడిన రీతిలో దర్శనమిచ్చిన గ్రామా లు పచ్చతోరణం కట్టుకున్నాయి. సాగునీటి వసతి పెరుగటంతో పడావు పడ్డ భూములకు జీవం వచ్చినట్లయింది. రైతుబంధుతో పాటు, రైతు బీమా, రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కూడా తెలంగాణలో వ్వవసాయ రంగానికి ఊతమిచ్చాయి. మరోవైపు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యు త్తు సాయం వ్యవసాయానికి మరింత బలాన్నిచ్చింది. పెరిగిన భూగర్భ జలాలు తెలంగాణ భూములను సస్యశ్యామలం చేశాయి.
తెలంగాణ భూభాగం ఎత్తులో ఉన్నందున సహజ నీటి ప్రవా హంతో జలాలు వ్యవసాయానికి అందుబాటులో ఉండేవి కావు. దీన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వర ఎత్తిపోతల లాంటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ప్రాజె క్టు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మించడంతో కోటి ఎకరాలకు సాగునీరు, ప్రజలకు ఇంటింటికీ తాగు నీరు ఇవ్వ డానికి భగీరథ ప్రయత్నాలు వడివడిగా జరిగాయి. తెలంగాణలో ఉన్న 60 శాతం జనాభా గ్రామీణ వ్యవసాయ ఆధారిత జీవనో పాధితో ప్రగతిపథంలో పరుగెడుతున్నది. ఆంధ్ర పాలకుల కాలం లో నెర్రెలు వారిన బీళ్లు నేడు జల ప్రవాహాలతో పచ్చటి తివాచీలు పరిచినట్టు, అత్యధిక ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తూ, ‘రైస్బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా’గా రూపాంతరం చెందింది.
మరోవైపు రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు, ఎరువులు, భూ రికార్డుల ప్రక్షాళన, ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు, వృద్ధాప్య, వితంతు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఆర్థిక చేయూతను ఇచ్చే అనేక విలక్షణ సంక్షేమ పథకాలను అమలు చేయటంతో గ్రామీణ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పేద రికాన్ని జయించే మహాయజ్ఞంలో తెలంగాణ ముందున్నది. సంక్షే మ పథకాల అమలుతో పాటు సమగ్రాభివృద్ధి గ్రామీణ ప్రాంతా లకు కొత్త జవసత్వాలను తీసుకొచ్చాయి. మొత్తం మీద గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంగా సాధించిన ప్రగతి తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దటంలో దోహద పడింది.
– డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి 98495 77610