నివ్ పునర్నిర్మాణానికి అలుపెరుగని కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞతకు, ముందుచూపునకు తగిన గుర్తింపు లభించింది. కేసీఆర్ ప్రత్యేకంగా నియమించిన డాక్టర్ గంగాధర్ను కేంద్ర ప్రభుత్వం కరోనా జాతీయ నిపుణుల కోర్ కమిటీలో సభ్యునిగా ఎంపిక చేసుకున్నది.
మొత్తం దక్షిణ భారతదేశం నుంచి కరోనా జాతీయ నిపుణుల కమిటీలోకి డాక్టర్ గంగాధర్ను నియమించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. కేసీఆర్ దార్శనికతకు నిలువుటద్దం వలె ప్రభుత్వ వైద్యానికి వన్నె తెస్తూ పేదలకు వైద్య సేవ చేయడంలో సైనికుడిగా గంగాధర్ పనిచేయాలి.
దక్కన్ పీఠభూమిలో హైదరాబాద్కు ఎంత గొప్ప చరిత్ర ఉందో వైద్యసేవల రంగంలో నివ్ వైద్యసంస్థకు అంతే గొప్ప స్థాయి ఉన్నది. 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ పదవి పోయిన తర్వాత రాజ్ ప్రముఖ్గా ఉండి నిజాం చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ను కట్టించారు. ఈ ట్రస్టుకు ఎముకల డాక్టర్గా బాగా పేరున్న మెట్టు రంగారెడ్డిని మొదటి సూపరింటెండెంట్గా నిజాం నియమించారు. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ 1964లో ప్రారంభించాక వైద్యరంగ నిపుణులు ఎందరెందరో సేవలందించి నివ్ పేరు తెచ్చారు. మొత్తంగా నివ్ డైరెక్టర్లుగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాకర్ల సుబ్బారావు, డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ దాసరి ప్రసాదరావులు ఎక్కువ కాలం పనిచేశారు.
రాష్ట్ర అవతరణ తర్వాత పునర్నిర్మాణ ప్రక్రియను భుజం మీద వేసుకొని ఏడేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలను తీర్చిదిద్దుతున్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చటానికి కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మించారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం మొత్తం వైద్యరంగాన్ని తీర్చిదిద్దే పనిలో భాగంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.
లోతుగా ఆలోచించి తిరుగులేని నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించటం కేసీఆర్కు తెలిసినట్లుగా ఇతరులకు తెలియదు. వైద్యశాఖామంత్రిగా ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ వైద్యరంగానికి సంబంధించిన నెఫ్రాలజీ రంగంలో నిపుణులు డాక్టర్ గంగాధర్ను సలహాదారునిగా, ఓఎస్డీగా నియమించారు. కేసీఆర్ నియమించిన వైద్య నిపుణులు డాక్టర్ గంగాధర్ సాదాసీదాగా ఉండే గట్టి వైద్య సైనికుడు. వైద్య వృత్తి మీద నిబద్ధత, నిమగ్నత కలవాడు. పత్రికల్లో కనిపించాలనుకోడు, వ్యక్తిగత ప్రచారాలకు దూరంగా ఉంటాడు, అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేయటం గంగాధర్ నైజం.
వీఐపీల దగ్గర్నుంచి సామాన్యుల వరకు అన్నివర్గాలకు సమంగా సేవలందించడానికి నివ్ మంచి కృషి జరుగుతున్నది. అడ్వాన్స్డ్ నెఫ్రాలజీలో శిక్షణ కోసం అమెరికా వెళ్లిన గంగాధర్ ఆ రంగంలో సేవలందిస్తూనే కొవిడ్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిరంతర సైనికునిగా పనిచేస్తున్నారు. గతేడాది వైద్య సేవలు అందిస్తూనే మొదటిదశ కరోనా కాటుకు గురయ్యారు.
తెలంగాణ అవతరణ తర్వాత నివ్ వైద్యసేవలు మరింతగా ప్రజలకు అందుతున్నాయి. కరోనా కాలంలో నివ్ పేరెత్తితే డాక్టర్ గంగాధర్ అని టక్కున చెప్పే దశకు తన నిరంతర సేవలను అందిస్తున్నారు. కరోనా జాతీయ నిపుణుల కోర్ కమిటీలో నివ్ వైద్యుడు డాక్టర్ గంగాధర్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం ద్వారా ఆయన సేవలకు గుర్తింపు, గౌరవం ఇచ్చినట్టయింది.
మొత్తం దక్షిణ భారతదేశం నుంచి కరోనా జాతీయ నిపుణుల కమిటీలోకి డాక్టర్ గంగాధర్ను నియమించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. కేసీఆర్ దార్శనికతకు నిలువుటద్దం వలె ప్రభుత్వ వైద్యానికి వన్నె తెస్తూ పేదలకు వైద్య సేవ చేయడంలో సైనికుడిగా గంగాధర్ పనిచేయాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలైన వైద్యం అందించాలన్నా కేసీఆర్ సంకల్పానికి బాసటగా నిలిచి చిత్తశుద్ధి గల వైద్య సేవకునిగా డాక్టర్ గంగాధర్ కృషిచేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ విశ్వాసాన్ని గెలిపించటమంటే తెలంగాణ ప్రజల నమ్మకాలను నిలబెట్టడమే అవుతుంది.
వైద్య వృత్తి చేపట్టిన ప్రతి వైద్యుడు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషిచేయాలి. వైద్యాన్ని పేదల వాకిళ్ల దాకా తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి వైద్యరంగం అంతా కృషిచేయాలి. సరైన వ్యక్తికి, సరైన పదవి లభించడం అదీ తెలంగాణకు లభించడం ఆనందదాయకం.
జూలూరు గౌరీశంకర్