ఎన్నో ఏండ్లుగా ఇన్విజిలేటర్, స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు చేస్తున్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాలనడం అర్థరహితం. నిబంధనల పేరిట కాలయాపన చేయడం తగదు. అదీకాకుండా జీవశాస్త్రం బోధించే టీచర్లను భౌతికశాస్త్రం, భాషోపాధ్యాయులను సాంఘిక శాస్త్రం సంబంధించి టెట్ రాయాలనడం విచిత్రం. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండానే కాంట్రాక్టు లెక్చరర్లను ఇంటర్, డిగ్రీ ఉపన్యాసకులుగా నియమిస్తూ.. ఉపాధ్యాయులు మాత్రం టెట్ ఉత్తీర్ణత సాధిస్తేనే పదోన్నతులు ఇస్తామని మెలిక పెట్టడం సమంజసం కాదు. ఒకవేళ టెట్ తప్పనిసరి అయితే సంబంధిత సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలి. మొదట పదోన్నతులు ఇచ్చి ఆ తర్వాత టెట్ ఉత్తీర్ణత సాధించడానికి గడువు ఇవ్వాలి. దాంతో పాటు వయోభారం రీత్యా 50 ఏండ్లు పైబడిన వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పదోన్నతులు ఇవ్వాలి. అదేవిధంగా టెట్ లేకుండానే డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ ఛాత్రోపాధ్యాయులకు న్యాయం చేయాలి.
– డాక్టర్ ఎస్.విజయ భాస్కర్
92908 26988