తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్వపు హుజూరాబాద్ నియోజక వర్గానికి చెందిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ప్రస్తుత హుజూరాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాలు, కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, వీ.సైదాపూర్, భూపాలపల్లి జిల్లాలలోని మొగుళ్లపల్లి, టేకుమట్లతో కలిపి మొత్తం 13 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రజలు కోరుతున్నారు.
ఈ ప్రాంత ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ర్టానికి కూడా హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చారిత్రక రాజకీయ అవసరం! పీవీ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో 2016 నుంచి 2020 వరకు ఈ జిల్లా ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రచారం నిర్వహించాం. పీవీ నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభించారు. ఆయన స్వగ్రామం వంగర హుజూరాబాద్ కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి.
– రావుల రాజేశం
స్వీయప్రకటిత ‘విశ్వగురు’ ప్రధాని మోదీ తన నకిలీ పబ్లిక్ రిలేషన్ ఇమేజ్ను మాత్రమే ప్రేమిస్తారు. అందుకే దేశంలో ఉన్న పేదరికాన్ని జీ-20 నేతలకు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీజీ దేశ పేదరికాన్ని ఎందుకు దాస్తున్నారు? మీ వైఫల్యాలు మీకే సిగ్గు తెప్పిస్తున్నాయా?
-సాకేత్ గోఖలే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ