పల్లవి: పల్లె పల్లెనా పొద్దు పొడుపురా..
పచ్చని మాగాణమయ్యి పులకరించెరా!
శెరువు నిండెరా శెల్క పండెరా..
ఇది చంద్రశేఖరన్న మిషన్ కాకతీయరా!
పనులు పెరిగి వలసలన్నీ ఆగిపోయెరా
పసిడి వనములాగ ఊరు మెరిసిపోయెరా
పంటసేలతో నేల మురిసిపోయెరా..!! ॥పల్లె పల్లె॥
చరణం1: బోరుబాయిలో నీరేలేక బీడుబోయి
కరువు కడుపుకిన్ని మెతుకులు..
తరతరాలుగా నీటి శరలతో
తల్లడిల్లిపోయె కన్నీటి బతుకులు..
దిక్కుతోచక బుగులు పుట్టగా
గులాబీ దళపతి అండగా నిలిచినాడుగా..
భూమితల్లినే నమ్మి బతుకుతున్న
మట్టిమనిషికే కొత్త జీవమొచ్చినాదిగా..
శెరువులు కుంటలు పూడికదీసీ
వాన చినుకులనే మనకోసం ఒడిసి పట్టెరా..
రైతన్నను రారాజుగజేసి
ధాన్యాగారంగా తెలంగాణ గతిని మార్చెరా.. ॥పల్లె పల్లె॥
చరణం2: శినుకు శినుకులా శెరువున జేరి
భూగర్భ జలముతో నిండుకుండగా మారి..
శెరువులో మన్ను శేనుకు బలమై
అగ్గువాయే పెట్టుబడి అధికమాయే దిగుబడి..
కరువు అన్నదే కానరాకా
నీటికొరతలంటూ లేని నేటి ఇలాక..
కలలుదీరగా జోర్దారుగా
బంగారు తెలంగాణ బాటబడ్డదీ ఇగ..
మన రైతులు శెరువు నీళ్ళుజూసి
మూడు పంటలను మురిపెంగా పండించెరా..
కేసియారు సారు రైతుకిచ్చే వరమూ
రైతు రారాజయ్యే భూమి తల్లి సాక్షిగా..! ॥పల్లె పల్లె॥
– రామకృష్ణ మనిమద్దె,
94928 83223