తెలంగాణ రచయితల సంఘం జంట నగరా లు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సం యుక్త ఆధ్వర్యంలో ‘కవి వారం’ కవితా సంకల నం ఆవిష్కరణ ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం లో జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సభలో నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. మామిడి హరికృష్ణ, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్కుమార్, ఎస్.రఘు, కె.వి ద్యావతి, బి.దేవదాస్, వి.శంకర్, టి.మల్లారెడ్డి, అహోబిలం ప్రభాకర్ పాల్గొంటారు. అనంతరం 48 మంది కవులతో కవి సమ్మేళనం ఉంటుంది.
– తెలంగాణ రచయితల సంఘం జంటనగరాలు
గ్రంథాలయాలు మన జాతి విజ్ఞాన సంపదలు. వాటిని గుర్తించి గౌరవించడం విధిగా భావించిన ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ గ్రంథాలయ సందర్శన యాత్రను ప్రారంభించింది. అందులో భాగంగా ఈ యేడు వేలాది పుస్తక సంపదను కలిగిఉన్న గుంటూరులోని ‘అన్నమయ్య గ్రంథాలయ సందర్శన యాత్ర’కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21న ఉదయం ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం తెలుగు రాష్ర్టాల్లోని రచయితలు, కవులతో గ్రంథాలయ సందర్శన యాత్రను ఏర్పాటుచేస్తున్నది. ఇం దులో భాగంగా ‘మన ఆంధ్రప్రదేశ్’ కవితా సంకలనం, ‘విత్తనం’ హైకూ సంపుటి ఆవిష్కరిస్తారు. కార్యక్రమంలో తెలుగు రాష్ర్టాల్లోని పలువురు కవులు, రచయితలు పాల్గొంటారు.
– ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
పిల్లల్లో వినోదం, విజ్ఞానం, వికాసం కలిగించాలనే లక్ష్యంతో బాల చెలిమి పర్యావరణ పరిరక్షణ అవగాహన కోసం కథల పోటీ నిర్వహిస్తున్నది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏ వస్తువైనా కథగా తీసుకోవచ్చు. తెలుగు వారందరూ అర్హులే. కథలు మే 10లోగా భూపతి సదన్, 3- 6-716, స్ట్రీట్నెం. 12, హిమాయత్నగర్, హైదరాబాద్-500 029కు పంపాలి.
– గరిపల్లి అశోక్, కన్వీనర్