కేసీఆర్ అనే నేను… తెలంగాణ వచ్చేదా క కొట్లాడుతా… ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టి చంపండి… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా… చిరుత పులులనైనా ఎదిరిస్తానంటూ… గాంభీర్యమైన తన సంకల్పబలంతో ఉద్యమ కాలం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుతెచ్చుకుంటే.. అప్పటి ఆ మాటల వెనుక ఉన్న ఆవేదన అర్థమవుతుం ది. సమైక్య పాలనలో అడుగడుగునా దోపిడీ, అణచివేత, వివక్షకు గురవుతున్న తెలంగాణ ను కాపాడటానికి గులాబీ జెండాను చేతబట్టి చావు అంచుదాక వెళ్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన మహోన్నత నాయకుడు కేసీఆర్. కేసీఆర్ తన కోసం పుట్టి న నాయకుడు కాదు… జనం కోసం తెలంగా ణ తల్లి కన్నబిడ్డ. అందుకే దాదాపు అరవై ఏం డ్లకు పైగా తీవ్రమైన అణచివేతలు, వివక్ష, దోపిడీకి గురైన సమైక్య పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాట యోధుడు.
2009, నవంబర్ 29. ఇది ఇటు చరిత్ర లో.. అటు భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ మరిచిపోలేని రోజు. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’… అంటూ గాంధీ చూపిన అహింసా మార్గంలో తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు ప్రతినభూనిన రోజు. తెలంగాణ యావత్ ప్రజానీకంతో పాటు ప్రపంచమంతా తెలంగాణ వైపు దృష్టిమళ్లించిన రోజు నవంబర్ 29. తెలంగాణ విముక్తి కోసం.. సర్వశక్తులతో కొట్లాడి చివరికి కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు.
తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కంటే ముందు అనేకమంది ఉద్యమించారు. కొందరు ప్రలోభాలకు లొంగితే, మరికొం దరు స్వార్థంతో ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన సందర్భం. సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ రాజకీయంగా ఓటమెరుగని తిరుగులేని శక్తిగా ఉన్నారు. కానీ, ఆయన దృష్టి అణచివేత నుంచి… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనవైపు మళ్లింది. సమై క్య పాలనలో సంపన్న వనరులు, నదీ జలాలున్నప్పటికీ తెలంగా ణ వెనుకబాటుకు గల కారణాలపై మేధావులతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతు న్న దోపిడీని ఎండగట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మేధావులు, ప్రొఫెసర్లతో చర్చించి తెలంగాణ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, ప్రజల జీవనవిధానాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు.
2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధ నే ధ్యేయంగా కేసీఆర్ అనేక మంది మేధావులతో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం సాధించడానికి రాజకీయ ప్రక్రియ అవసరమనే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్సార్ మార్గదర్శకంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్కు సబ్బండ వర్గాలు మద్దతుగా నిలిశారు. దీంతో 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిం ది. కానీ తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేయడంతో తిరిగి ఉద్యమబాట పట్టారు కేసీఆర్. 2009లోనూ మహా కూటమితో జతకట్టి తెలంగాణవాదాన్ని జాతీయస్థాయిలో బలం గా వినిపించగలిగారు.
కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టడానికి కేసీఆర్ అనేక సభలు నిర్వహించి తెలంగాణ సమాజంలో అవగాహన కల్పించారు. టీఆర్ఎస్ను నిర్వీర్యం చేయాలని ఎన్నిశక్తులు అడ్డుపడ్డప్పటికీ కేసీఆర్ మాత్రం ఉద్యమ బాధ్యతల నుంచి ఏనాడూ తప్పుకోలేదు. తెలంగాణ కోసం కొట్లాడుతున్న అందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’.. అంటూ సిద్దిపేట వేదికగా తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పింది. కేసీఆర్ అరెస్టు తర్వాత సబ్బండవర్గాలు ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన ఆందోళనలతో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించక తప్పలేదు. ఆ విధంగా 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నది. అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది.
సంపత్ గడ్డం: 78933 03516