డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న లెక్చరర్లలో 60-70 శాతం మంది గెస్ట్ ఫ్యాకల్టీయే. డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ 1,400 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు 500 మంది కాగా, గెస్ట్ లెక్చరర్లు 1,600 మంది ఉన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఎప్పటి నుంచో పని చేస్తున్నవారిని గత ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. కానీ, గెస్ట్ ఫ్యాకల్టీగా పదేండ్లుగా పనిచేస్తున్నవారు అర్హతలు ఉన్నప్పటికీ అందుకు నోచుకోలేదు. అన్ని అర్హతలున్న వారిని కనీసం కాంట్రాక్టు పద్ధతిలోకి కూడా మార్చడం లేదు. ఒకే రాష్ట్రంలో ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న లెక్చరర్లను వేర్వేరుగా చూడటం ఎంతవరకు న్యాయం. కన్సాలిడేటెడ్, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 1,600 మంది అతిథి అధ్యాపకులను ఆటో రెన్యువల్ చేయాలి. పీరియడ్ విధానాన్ని రద్దు చేసి నెలకు రూ.50 వేల ఏకీకృత వేతనాలు చెల్లించి న్యాయం చేయాలి.
-డాక్టర్ కొర్ర ఈశ్వర్లాల్
94911 11983