పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ఉద్యమసారథి కేసీఆర్ది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేసే దిశగా తీసుకెళ్తున్నారు.
కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, సంస్కరణశీలి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదట నిర్వహించిన అధికారిక సమావేశం రాష్ట్ర డీజీపీతోనే. రాష్ట్రంలో శాంతిభద్రతలు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమని కేసీఆర్ బలంగా విశ్వసించారు. అందుకే బూజు పట్టిన పోలీస్ వ్యవస్థను ముందుగా ప్రక్షాళన చేశారు. తాతల నాటి వాహనాల స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సరికొత్త ఇన్నోవా వాహనాలను పోలీస్ శాఖకు అందించారు. పాతకాలం ఆయుధాల స్థానంలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చారు. శిథిలావస్థకు చేరుకున్న అనేక పోలీస్ స్టేషన్లను ఆధునీకరించారు. అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త భవనాలను నిర్మించేందుకు పూనుకున్నారు.
‘ప్రజల వద్దకు పాలన’ను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలకు పెంచారు. దీనివల్ల సుదూరంగా ఉన్న జిల్లా కేంద్రాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ‘ధరణి’ పోర్టల్తో రెవెన్యూ రికార్డులను పక్కాగా నమోదు చేయించి, భూ వివాదాలను నివారించారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్, పోలీస్ అధికారుల భవనాలను సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణకు తలమానికంగా నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను అతి తక్కువ కాలవ్యవధిలోనే నిర్మించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ‘స్కాట్లండ్ యార్డ్ పోలీస్ వ్యవస్థ’ స్థాయికి తీసుకువెళ్లాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.
‘టీ హబ్’ పేరుతో హైదరాబాద్ మాదాపూర్లో అతిపెద్ద భవంతిని స్టార్టప్ల కంపెనీల ఆవిష్కరణల కోసం నిర్మించారు. పేదల బతుకుకు భరోసా కల్పిస్తూ వికలాంగులకు రూ.3,016, ఇతర వర్గాలకు రూ.2,016 పింఛన్లను అందిస్తున్నారు. వయోపరిమితిని 57 ఏండ్లకు కుదించారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్ది. రైతుకు రైతుబంధు, 24 గంటల నాణ్యమైన, ఉచిత కరెంటు, రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. పేదింటి ఆడపిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గర్భవతుల రక్షణకు అమ్మఒడి, తల్లీబిడ్డల ఆరో గ్యం కోసం ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ పరిపుష్టికి గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, ప్రజా వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానల ఆధునికీకరణ, పేద ప్రజల కంటి సమస్యల నివారణకు కంటివెలుగు పథకం వం టి ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మా ణం గొప్ప పథకం. హరితహారం పథకంతో తెలంగాణ నేడు పచ్చగా కళకళలాడుతున్నది.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి చుట్టూ ఉన్న రాష్ర్టాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పంజాబ్, యూపీ, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి సుదూర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం తెలంగాణకు వచ్చే రైతులు, వలస కూలీలు, ఇతర కార్మికులు తెలంగాణలో జరుగు తున్న అభివృద్ధిని, ప్రజా సంక్షేమం కోసం ప్రభు త్వం పడే తపన ను చూసి దేశానికి కూడా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వంటి సీనియర్ నాయకులు కూడా జాతీ య నేతగా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటే కేసీఆర్ దేశ్ కీ నేత అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలవుతున్నది. పేదల బతుకులు దుర్భరంగా మారాయి. తాగే పాల దగ్గరి నుంచి ప్రతి వస్తువూ కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. గడిచిన మూడేండ్లలో స్టీల్, సిమెంట్, ఇసుక ధరలు 50 శాతం పెరిగాయి. పాల ధర 20 శాతం పెరిగింది. స్కూళ్లు, కళాశాల ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ ప్రియమయ్యాయి. వంట గ్యాస్ సబ్సిడీ కూడా మాయమైంది. ధరల నియంత్రణను గాలికి వదిలేసి, మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలను ప్రపంచ కుబేరులుగా తయారుచేయడంలోనే నిమగ్నమైంది.
వందేండ్లలో జరగాల్సిన అభివృద్ధిని కేవలం ఎనిమిదేండ్లలో చేసి చూపించిన నాయకుడు కేసీఆర్. కానీ మోదీ నాయకత్వంలో దేశం వందేండ్ల వెనక్కి వెళ్లింది. అందుకే ప్రజా, రైతు, దేశ సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ నాయకత్వం కోసం ఈ దేశం ఎదురుచూస్తున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని బంగా రు తెలంగాణగా మార్చినట్లే భారతదేశాన్ని బంగారు భారత్గా మార్చ డం ఒక్క కేసీఆర్కే సాధ్యమవుతుందని యావత్ దేశం విశ్వసిస్తున్నది. అందుకే అందరూ దేశ్ కీ నేత కేసీఆర్ అని నినదిస్తున్నారు.
పంజాబ్, యూపీ, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి సుదూర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం తెలంగాణకు వచ్చే రైతులు, వలస కూలీలు, ఇతర కార్మికులు తెలం గాణలో జరుగుతున్న అభివృద్ధిని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పడే తపనను చూసి దేశానికి కూడా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.
మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలవుతున్నది. పేదల బతుకులు దుర్భరంగా మారాయి. తాగే పాల దగ్గరి నుంచి ఏ వస్తువూ కొనలేని పరిస్థితికి ప్రజలు చేరుకున్నారు. గడిచిన మూడేండ్లలో స్టీల్, సిమెంట్, ఇసుక ధరలు 50 శాతం పెరిగాయి. పాల ధర 20 శాతం పెరిగింది. స్కూళ్లు, కళాశాల ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ ప్రియమయ్యాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వంట గ్యాస్ సబ్సిడీ కూడా మాయమైంది. ధరల నియంత్రణను గాలికి వదిలేసి, మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలను ప్రపంచ కుబేరులుగా తయారుచేయడంలోనే నిమగ్నమైంది.
– కోలేటి దామోదర్
98491 44406
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్)