స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు గడిచినప్పటికీ మూస బడ్జెట్ విధానాన్నే అమలు చేయటం వల్ల దేశంలో దాదాపు 80శాతం ప్రజల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉన్నది. కాలం చెల్లిన బడ్జెట్ రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, అలాగే గ్రామం యూనిట్గా ఉండే కొత్త తరహా బడ్జెట్ను రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిన అవసరం దేశ పాలకులకు, ఆర్థిక మేధో సంపన్నులకు ఉన్నది. బడ్జెట్ అంటే జమా ఖర్చుల పట్టికగా, వార్షిక, ఆర్థిక ప్రకటనగా, నూతన ఆర్థ్ధిక సంవత్సరంలో ద్రవ్య వ్యయానికి పార్లమెంట్ ఆమోదం పొందే ప్రక్రియగానే చూడరాదు.
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు. 2022-23 ఆర్థ్ధిక సంవత్సరం జీడీపీ శాతం 9.2 శాతం అన గా రూ.147.5 లక్షల కోట్లుగా ఉంటు ందని గత బడ్జెట్ సమయంలో పేర్కొన్నారు. కానీ ఎకనమిక్ సర్వే ప్రకారం 20 22-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 శాతంగా అంచనా వేశారు. నూతన బడ్జెట్ ప్రవేశకాలంలో 2023-24కు 6.5 శాతం గా జీడీపీ ఉంటుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేవలం జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల వల్లనే దేశంలోని సామాన్య ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఆలోచన అసంబద్ధమైంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో కరోనా సంక్షోభం రాకమునుపే జీడీపీ వృద్ధిరేటు కేవలం 4.1శాతం మాత్రమే. అలాగే 2020-21 లో 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో కనివినీ ఎరుగ ని విధంగా -7.3 శాతానికి జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. సామాన్యుల, సంపన్నుల ఆదాయా లు కలిపి లెక్కవేయడం వల్ల జీడీపీలో వృద్ధి కనిపిస్తున్నది.కానీ సామాన్యుల ఆదాయంలో మార్పే మీ ఉండదు. అసమానతలు అలాగే ఉంటాయి.
ఒకవైపు భారతదేశం అభివృద్ధి చెందినట్లుగా ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.276, పట్టణ ప్రాంతాల్లో రూ.296లోపు ఆదాయమున్న వా రిని పేదలుగా పరిగణిస్తున్నారు. కానీ నెలకు రూ. 10వేల నుం చి రూ.15వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్నే అనుభవిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచిక) ప్రకారం దేశం 107వ ర్యాంకులో ఉన్న ది. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఇండియా లో 1 శాతం ప్రజల చేతుల్లో 45.5 శాతం సంపద, 10 శాతం ప్రజల చేతుల్లో 80 శాతం సంపద, 50 శాతం ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నది. దీంతో భారత్ సంప న్న భారత్.. పేదల భారత్గా విడిపోయింది.
2021-22లో రూ.14.82లక్షల జీఎస్టీ వ సూలవ్వగా అందులో కిందిస్థాయి ప్రజలనుంచి 64 శాతం, మధ్యతరగతి ప్రజల నుంచి 33 శాతం వసూలైంది. సంపన్నులు కేవలం 3 శాతం మాత్రమే జీఎస్టీ పన్నులు చెల్లిస్తున్నారు. అలాగే 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పన్నును 30శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. దీనితోపాటు ఇటీవల కేంద్రప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రూ.10 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసింది. దేశానికి పరోక్ష పన్నులు (జీఎస్టీ)ల రూపంలో 80శాతానికి పైగా పన్నులు చెల్లిస్తూ దేశాన్ని బతికిస్తున్న పేదలకు సబ్సిడీల రూపంలో ఇస్తున్న సహాయాన్ని ఉచితాలుగా అవహేళన చేస్తూ కార్పొరేట్ సంస్థలను, వ్యక్తులను కాపాడే మన ప్రధానమంత్రి ‘అమృత్కాల్’ పేరు తో ప్రవేశపెట్టే బడ్జెట్లతో ఈ అసమానతలు తొలగిపోతాయనుకోవటం పగటి కలే.
2021లో 104 మంది సంపన్నుల ఆస్తి 23 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం శతసహస్ర కోటీశ్వరుల సంఖ్య 104 నుంచి 166కు పెరిగి వారి మొత్తం సంపద దాదాపు రూ.55 లక్షల కోట్లకు చేరింది. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల విధ్వంసానికి కార్పొరేట్ శక్తుల వికాసానికి నరేంద్రమోదీ పూనుకున్నారు. సంపద పెరిగితే కింది స్థాయి వరకు ఉద్యోగ అవకాశాలు, ఇతర సౌకర్యాలు కల్పించబడతాయని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త కీన్స్ ప్రతిపాదించిన ట్రికిల్ డౌన్ థియరీ మ న దేశ పరిస్థితుల్లో పూర్తిగా వైఫల్యం చెందింది.
ఈ విధానం మారాలంటే జీరో ఆధారిత బడ్జె ట్, వ్యక్తి కేంద్రక బడ్జెట్ తక్షణ అవసరం. స్వా తంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ మూస పద్ధతిలో ఉండటం వల్లనే అసమానతలు రోజురోజుకూ అధికమవుతున్నా యి. మన దేశంలో బ్యాలన్సుడ్ బడ్జెట్, సర్ ప్లస్ బడ్జెట్, డెర్బ్సి షీట్ బడ్జెట్ విధానాలను అనుసరిస్తున్నారు. దీనినే సాంప్రదాయక బడ్జెట్గా కూడా పేర్కొంటున్నారు. గత బడ్జెట్లతో సంబంధం లేకుండా ప్రస్తుత వాస్తవ పరిస్థితులపై ఆధారపడి కొత్తగా జీరో పాయింట్ నుంచి తయారు చేసేది జీరో బడ్జెట్. దీనివల్ల పారదర్శకంగా ప్రతీ రూపా యి అర్హుడికి చేరుతుంది. అసమానతలు కూడా కాలక్రమంలో తగ్గుతాయి.
జీరో బడ్జెట్తో నిధుల సమీకరణ సమస్య ఉ త్పన్నమవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా సంపదపైన కొంతపన్ను ను విధించాలి. ఈ క్రమంలో సంపన్నులు దాతృ త్వం ప్రకటించాలి. సంపన్నుల వితరణ, సంపద పై పన్ను, పేదలకు నేరుగా నగదు సాయం లాం టి చర్యలతో తప్పనిసరిగా దేశం బాగుపడుతుం ది. దీన్ని సమాఖ్య స్పూర్తితో అమలు చేయాలి. అలా చేస్తే మహత్తరమైన ఆర్థిక వ్యవస్థను, ఉజ్వ ల భారతదేశాన్ని నిర్మించుకోవచ్చును.
కూనంనేని సాంబశివరావు
(వ్యాసకర్త: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు)