ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు టామీతో పడవలో ప్రయా ణిస్తున్నాడు. ఆ పడవలో ఇతర ప్రయాణీకులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు. టామీ ఇంతకు ముందు పడవలో ఎప్పుడూ ప్రయాణించలేదు, కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు. అందువల్ల అది ఎవరినీ శాంతంగా కూర్చోనివ్వకుండా అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నది. దీంతో పడవ నడిపే వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు. ఈ టామీ వల్ల, ప్రయాణికుల భయం కారణంగా పడవ మునిగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నాడు. టామీ శాంతించకపోతే అది పడవని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆ టామీని తెచ్చిన మనిషి పడవలో ఉన్న ఈ పరిస్థితి గురించి కలత చెందుతున్నాడు. కానీ దానిని శాంతింపచేయడానికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వాళ్లలో ఉన్న తత్వవేత్త ఇదంతా చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘మీరు అనుమతిస్తే, నేను ఈ టామీని ఇంటి పిల్లిలా నిశ్శబ్దంగా చేయగలను’ అని ఆ టామీ యజమానితో ఆ తత్వవేత్త చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు. తత్వవేత్త, ఇద్దరు ప్రయాణికుల సహాయంతో టామీని ఎత్తుకొని నదిలోకి విసిరాడు. టామీ నీటిలో తేలుతూ ఉండటానికి ఈత కొట్టడం ప్రారంభించింది. దానికి ఇప్పుడు ఈత కొట్టకపోతే చచ్చిపోతాను అని తెలిసి, ప్రాణం నిలుపుకోవడం కోసం కష్టపడడం మొదలుపెట్టింది. కొంత సమయం తరువాత, తత్వవేత్త టామీని తిరిగి పడవలోకి లాగాడు. టామీ వెళ్లి పడవలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చున్నది. మారిన టామీ ప్రవర్తనను చూసి దాని యజమాని, ఇతర ప్రయాణికులందరూ ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు.. ‘మొదట అది అటూ ఇటూ దూకింది. ఇప్పుడు పెంపుడు పిల్లిలా కూర్చున్నది. కారణం ఏమిటి?’ అని. తత్వవేత్త ఇలా అన్నాడు.. ‘ఈ తరహా ఇబ్బందిని అనుభవించకుండా మరొకరి కష్టాన్ని ఎవరూ సరిగా అర్థం చేసుకోలేరు. నేను ఈ టామీని నీటిలోకి విసిరినప్పుడు, అది నీటిలో మునిగిపోయే ప్రమాదాన్ని, పడవ ఉపయోగాన్ని అర్థం చేసుకున్నది. అందువల్లే ఈ మార్పు’ అని చెప్పారు. తెలంగాణ బాగలేదు, వాక్ స్వాతంత్య్రం లేదు, స్వేచ్ఛ లేదు, ప్రభుత్వాన్ని బాగా నడపడం లేదు అంటూ అటూ ఇటూ దూకుతున్న వాళ్ళను మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ ఏలుబడి రాష్ర్టాలలోకి పంపి, ఆరు నెలలు అక్కడే ఉండనివ్వాలి. తర్వాత వారు తెలంగాణకు తిరిగి వచ్చినప్పుడు ఆటోమాటిక్గా పెంపుడు పిల్లిలా ప్రశాంతంగా జీవించడం నేర్చుకొని ఒక మూల కూర్చొని ఉంటారు.
తెలంగాణను రోజూ తిట్టుకునే అన్ని టామీలకు ఇది అంకితం.
(సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్)