ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ పేరుతో 38వ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆఫ్ డిఫెన్స్ (2022-2023) ఇచ్చిన నివేదిక ప్రకారం దాని అసలు లక్ష్యం వాటిని ప్రైవేటీకరించడమేనని స్పష్టమవుతున్నది. ఆ లక్ష్యం దిశగా తొలి అడుగులో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ఆర్డర్లు రావడమే కరువైంది. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను టెండర్లలో పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు.
ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించడం వల్ల కొంతకాలానికి అవి నష్టా ల సంస్థలుగా మారుతాయి. ఈ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం ఉపయోగించుకొని వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తుంది. పూర్వపు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కొత్తగా సృష్టించిన డిఫెన్స్ అండర్ టేకింగ్ యూనిట్స్గా పునర్నిర్మించడం అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఉత్పాదక, లాభదాయక ఆస్తులుగా మార్చడం, పోటీతత్వాన్ని పెంపొందించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడమనేది లక్ష్యం.
దీని ప్రకారం మరింత క్రియాత్మక, ఆర్థిక స్వయం ప్రతిపత్తితో కొత్త డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ యూనిట్స్ దేశ, విదేశాల్లో కొత్త మార్కెట్లను అన్వేషిస్తాయి. అయితే ఇదంతా కేవలం కార్పొరేటీకరణకు మద్దతు కోసమే ఉద్దేశించబడింది. అసలు విషయాన్ని పరిశీలిస్తే గతంలో కార్పొరేటీకరణ జరిగిన ఏడు సంస్థలకు కలిపి 2023-24 సం వత్సరానికి రూ.16,694.58 కోట్ల ఆర్డర్లు మాత్ర మే వచ్చాయి. మ్యూనిటేషన్ ఇండియా లిమిటెడ్, ఆర్మోర్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ కార్పొరేషన్లకు మాత్రమే కొన్ని ఆర్డర్లు వచ్చాయి. మొత్తం 8 ఫ్యాక్టరీలతో కూడిన ఆర్మోర్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్కు రూ.1915 కోట్లు, 4 ఫ్యాక్టరీలు ఉన్న ట్రూఫ్ కంఫ ర్ట్ లిమిటెడ్కు రూ.88.89 కోట్లు, మరో 8 ఫ్యాక్టరీ లు గల యంత్ర ఇండియా లిమిటెడ్కు రూ.700 కో ట్ల ఆర్డర్లు వచ్చాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు నేరుగా ఇండెంట్లు ఇవ్వడం ఆపి, ఓపెన్ టెండర్ల ద్వారా ప్రైవేట్కు వెళ్లడంతో మొత్తం ఏడు కార్పొరేషన్ల భవిత వ్యం తలకిందులైంది. ఇటీవల ఆర్మీ కొత్తగా 12 లక్షల ఆర్మీ యూనిఫామ్ల సేకరణకు బహిరంగ టెండర్ను ఆహ్వానించింది. కానీ ఆంక్షల మూలంగా ట్రూఫ్ కంఫర్ట్ లిమిటెడ్ కింద ఉన్న 4 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు టెండర్లో పాల్గొనడానికి కూడా అనుమతించబడలేదు.
గ్లెడర్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేషన్ కింద ఉన్న పారాచూట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని విస్మరించి, ప్రైవే ట్ ఉత్పత్తిదారుల నుంచి 350 కంబాట్ ఫ్రీ ఫాల్ పారాచూట్ సిస్టమ్ కొనుగోలు చేయాలని సైన్యం నిర్ణయించింది. కార్పొరేటీకరణ పేరుతో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నదని గుర్తించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, వారి సంఘాలు కార్పొరేటీకరణను ప్రతిపాదించిన రోజు నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజ్డ్ అసోసియేషన్లు అధికారులకు వివరణాత్మక నోటీసును కూడా సమర్పించాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు పరిధిలోని డిపార్ట్మెంటల్ సంస్థలుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల హోదాను పునరుద్ధరించాలని వారు అందులో కోరారు. అలాగే ఉద్యోగ సంఘాలు ఇచ్చిన విలువైన సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రూ. 30 వేల కోట్ల విలువైన రక్షణ రంగ సంస్థ ప్రైవేటీకరణ అనేది పెట్టుబడిదారీ వర్గాల కుట్రలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించే బాధ్య త ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల దే. దేశ భద్రతకు సంబంధించిన రక్ష ణ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తుల ప్రమే యంఉండరాదన్నది ప్రజల డిమాండ్.
-ఆళవందార్ వేణుమాధవ్
86860 51752