దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. దీని వల్ల నేడు గిరిజనులు విద్యాధికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. గిరిజనుల పాలిట మరో సంత్ సేవాలాల్, కొమరం భీమ్గా మారిన కేసీఆర్ దేశాధినేత కావాలని దేశ గిరి’జనం’ ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలతో సమానంగా గిరిజనులు ఎదగడం కోసం విద్య, ఉద్యోగాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను పెంచింది. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రూ.75,450 కోట్లు కేటాయించింది. ఇం దులో ఇప్పటివరకు రూ.47,258 కోట్లను ఖర్చు చేసింది. టీఎస్ ప్రైడ్ పథకంలో భాగంగా 13, 264 ఔత్సాహిక గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రూ.639.24 కోట్లను ఖర్చు చేసింది. గిరిజనుల కోసం ఎస్టీ సబ్ ప్లాన్ను అమలు చేస్తున్నది.
కొండ కోనల్లో జీవించే గిరిజనుల ఆవాసాలకు రోడ్లు, తాగునీటి వసతి కల్పించింది. వారి ఇండ్లకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. 1,00,942 ఇండ్లకు ఈ సదుపాయం కల్పించింది. ఇందుకోసం 20 14 నుంచి నేటి వరకు రూ.192 కోట్లను ఖర్చు చేసింది. రూ.221 కోట్లు ఖర్చు చేసి 3,433 గిరిజన ఆవాసాలకు త్రీ ఫేస్ విద్యుత్తు సౌకర్యం కల్పించింది. 1,682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1,276 కోట్లతో బీటీ రోడ్లు వేసింది. ఈ సంవత్స రం 2090 గిరిజన పల్లెల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించింది. అత్యం త వెనకబడిన ఆదివాసీ తెగలు నివసిస్తున్న గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కింద రూ.133 కోట్లు కేటాయించింది.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో వారి పేరున ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించారు సీఎం కేసీఆర్. ఈ భవనం పక్కనే కుమ్రంభీం ఆదివాసీ భవన్ను నిర్మించారు. 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న గిరిజన భవనాలకు ఒక్కో భవనానికి రూ.1 కోటి చొప్పున సీఎం నిధులు మంజూరు చేశారు. గిరిజన మహనీయులైన కుమ్రం భీం, సేవాలాల్ మహరాజ్ల జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. మేడా రం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఘనంగా నిర్వహిస్తున్నది. నాగోబా, జంగుబా యి, బరంపూర్, ఎరుకల నాంచారమ్మ, గాంధా రి మైసమ్మ వంటి జాతరలను కూడా ప్రభుత్వ మే నిర్వహిస్తున్నది. కుమ్రంభీం స్మారక కేంద్రా న్ని, గోండుల సంస్కృతిని తెలిపే మ్యూజియాన్ని ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలోని జోడేఘాట్ వద్ద నిర్మించింది. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీం జిల్లాగా నామకరణం చేసింది. మేడారం దగ్గర రూ.22.53 కోట్లతో సమ్మక్క సారలమ్మ మ్యూ జియం ఏర్పాటు చేసింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో గిరిజనుల స్థితిగతులను అధ్యయనం చేసి వారి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గిరిజనుల రిజర్వేషన్ల శాతాన్ని 10 శాతానికి పెంచి అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాల లైసెన్సు ల్లో కూడా గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి 131 మంది గిరిజనులకు దుకాణాలు కేటాయించారు. మా తండాలో మా రాజ్యం అన్న గిరిజనుల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నిజం చేశారు. 500 మంది జనాభా మించి ఉన్న 2,471 తం డాలు,గూడేలను గ్రామ పంచాయతీలుగా మా ర్చారు. దీనివల్ల వేలాదిమంది గిరిజన యువతీ, యువకులు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా రాజకీయా ధికారంలో భాగమయ్యేలా చేసిన ఘనత కేసీఆర్దే.
చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఏంట్రపెన్యూర్ ఇన్నోవేషన్ స్కీమ్ ద్వారా ఎస్టీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథ కం కింద ఇప్పటి వరకు 162 మంది అర్హులైన వారిని గుర్తించి రూ.67.19 కోట్లను రాయితీ రూపంలో అందజేసింది. 58 ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లకు రూ.10.32 కోట్లను అందించింది. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 64 యూనిట్లకు రూ.15.46 కోట్లను ఖర్చు చేసింది. సీఎం గిరి వికాస్ పథకం కింద 18,967 మంది అర్హులైన ఎస్టీలకు రూ.93.67 కోట్లు ఖర్చు చేసింది. ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ ఈఎస్ఎస్ కింద 79, 220 మంది లబ్ధిదారుల కోసం రూ.422.66 కోట్లను ఖర్చు చేసింది. ట్రైకార్ పథకం ద్వారా 388 మంది లబ్ధిదారులకు రూ.97.68 కోట్లను అందించింది.
గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 92 గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. వీటి లో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు, లా కాలేజీలు, సైనిక్ స్కూళ్లు, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఉన్నాయి. వీటి నిర్మాణానికి రూ.292 కోట్లు కేటాయించింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న 237 మంది ఎస్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున రూ. 33.49 కోట్లు అందజేసింది. గురుకులాల్లో శిక్షణ పొందిన 918 మంది ఎస్టీ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వా రా రక్షిత తాగు నీటిని అందిస్తున్నది. ఏజెన్సీ ఏరియాల్లో విష జ్వరాలను అరికట్టడంలో సఫలీకృతమైంది. కేసీఆర్ కిట్లు, రైతు బంధు, రైతు బీమా,ఆసరా పింఛ న్లు కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలన్నీ గిరిజనులకు అందు తున్నాయి.
డాక్టర్ కరాటే రాజు నాయక్: 95509 00009