పసుపు బోర్డుపై బాండ్ రాసిచ్చి పరువు పోగొట్టుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికీ నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నిండు పార్లమెంట్లోనే తన పరువు పోగొట్టుకున్నంత పనిచేసి అభాసుపాలయ్యారు.
పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లో స్టేట్ సపోర్టు ఫర్ రోడ్ సెఫ్టీ ప్రోగ్రామ్ను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నదా? ఈ కార్యక్రమానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? వాటిని వినియోగించుకుందా? అని అరవింద్ లిఖితపూర్వకంగా ప్రశ్న వేశారు. దీనికి ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇస్తూ అలాంటి పథకమేది కేంద్రం ఇంతవరకు ప్రారంభించలేదని చెప్పారు. దీంతో అరవింద్కు ఏం చెప్పాలో తెలియక గుండుపై చేతితో నిమురుకోక తప్పలేదు.