సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ల సర్వీసు రూల్స్ మార్చడం, సంబంధిత రాష్ర్టాలతో చర్చించకుండానే నదుల అనుసంధానం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ప్రస్తుతం దేశానికి కావాల్సింది రాజ్యాంగ సవరణలు కాదు, పునఃసమీక్షించుకొని తిరిగిరాయాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఇంకేముంది కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ వ్యాఖ్యల అంతర్లీనాన్ని పక్కనపెట్టి కిరికిరి నాయకులు కొందరు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించారంటూ రాద్ధాంతం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ఇండియా గేట్ వద్ద అమరజ్యోతికి ప్రధాని నివాళులర్పించడం 1972 నుంచి ఆనవాయితీగా వస్తున్నది. దీన్ని పక్కనబెట్టి ప్రధాని మోదీ తాను 2019లో ప్రారంభించిన అమరజవాన్ జ్యోతికి నివాళులు అర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరత్యాగాన్ని విస్మరించిన ఈ కుహనా దేశ భక్తులకు ప్రధాని చర్య తప్పుగా కనిపించదు. కానీ రాజ్యాంగాన్ని తిరిగిరాయడం మంచిదన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో దేశ ద్రోహంగా కనిపించింది. పసరికలు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వీరికి ఇతరులదే తప్పుగా కనిపిస్తుంది తప్పా, కేంద్రం చేసే తప్పులు మాత్రం కనిపించవు.
– వెల్జాల