‘బీజేపీ ఎలాగూ గెలువదనే బీసీని సీఎం చేస్తామని అన్నారా?’ అని నిలదీస్తున్నారు. బీజేపీ అంటే గిట్టని ఏ కాంగ్రెస్సో, బీఆర్ఎస్సో, కమ్యూనిస్టుల నుంచో ఈ విమర్శ వస్తే లైట్ తీసుకోవచ్చు. కానీ, స్వయానా కాషాయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ విషయంపై నిలదీస్తున్నారంటే కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే.
గెలిస్తే ఎలాగూ బీసీని సీఎంను చేస్తామన్నారు కదా? గెలువలేదు కాబట్టి కనీసం బీజేపీ శాసనసభాపక్షం నేతగానైనా బీసీని నియమించాలని బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారు. పోయిన దఫాలో బీజేపీఎల్పీ నేత లేకుండానే నెట్టుకొచ్చారు. ఈ దఫా అయినా నియమించే ఆలోచన ఉన్నదా? లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్కు తెలుగు సరిగా రాదు… కాబట్టి బీజేపీఎల్పీ తనకే ఇవ్వాలని ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీసీ ఎమ్మెల్యేలు బీసీ సీఎం అన్నోళ్లు కనీసం బీజేపీఎల్పీ అయినా ఇవ్వలేరా? అని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు.