సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అవినీతి నేతలు ఏ ఊర్ధ్వ లోకాలనుంచో ఊడిపడరు. మన సమాజంలోంచే వస్తరు. ఇలాంటి నీతి, నిబద్ధత లేని పాలకుల మూలంగా నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
‘మీ రాజకీయ నాయకులు ఎందుకు అంత స్వార్థంతో ఉంటరు’ అని బీబీసీ రేడి యో-4 ఇంటర్వ్యూలో అడిగితే… టోనీహెకల్ట్సన్ అనే బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఇలా చెప్పారు.. ‘పన్నులు ఎగ్గొట్టేవారు, తాగుబోతులు, భార్యలను హింసించేవారు, ఘరానా మోసగాళ్ళు సమాజం నిండా ఉన్నరు. అక్కడి నుంచే వచ్చిన మేం భిన్నం గా, ఉన్నట్టుండి ఎలా మారిపోగలం?’. ఇట్లా ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి, ధైర్యం కావాలి. ఆర్థిక అవినీతి కన్నా, నీతి, నిబద్ధత లేని రాజకీ యంతో తీవ్ర నష్టం జరుగుతుంది. కానీ రాజకీయ నాయకుల అవినీతి ఎక్కువ చర్చనీయాంశం కావ టం లేదు. దేశాన్ని తెగనమ్ముతూ కూడా భేషుగ్గా తిరుగుతున్నరు. ఇలాంటి వారే.. రాజకీయ కక్షలు, రాజకీయ లక్ష్యాలతో ఈడీ, బోడీ, మోడీ దాడులను ఆయుధాలుగా ఎంచుకుంటున్నరు.
అవినీతి అంటే ఏమిటి? నైతికత లేకపోవటం అంటే ఏమిటి? విలువలు లేకపోవటం అంటే ఏ మిటి? – రెక్కలు ముక్కలు చేసుకుని ఈ దేశ సంపదను పెంచుతున్న సామాన్య ప్రజలను జీఎస్టీ పేరు తో దోపిడీ చేయడం. కార్పోరేట్ గద్దలకు దోచిపెట్టిన మొత్తంలో ఒకటో వంతు ప్రజాధనాన్ని వివిధ సం క్షేమ రూపాల్లో ప్రజలకు అందిస్తే అవి ఉచితాలనడం వాటిని బంద్ చేయాలి అని వాగడం.
అన్ని రంగాల్లో, ఆత్మగౌరవంతో తన రాష్ర్టాన్ని నెంబర్ వన్గా నిలబెడుతున్న ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం అవినీతి. తమ కక్షసాధింపు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతరు అన్న సోయిలేనితనం, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం, అందుకోసం అన్ని ప్రజాస్వామిక, రాజ్యాంగ విలువలకు పాతర వేయడం, దళితుల సాధికారతను సహించలేకపోవడం, దళితుల స్వావలంబనకు పనికొచ్చే దళితబంధు లాంటి పథకాలను సైతం వ్యతిరేకించడం, తమ తాబేదారులైన మీడియా అధిపతులతో చెప్పించడం అవినీతి.
రాముడు, కృష్ణుడి తాత్వికతను పాతి పెడు తూ, వారి పేర్లతో రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడం పెద్ద అవినీతి. ఎనభై శాతం హిందువులను వారి వేలితో వారి కన్నునే పొడుచుకునే దుర్మార్గానికి తెగబడటం అవినీతి. విదేశాల్లో దేశ ప్రతిష్ఠ దిగజార్చటం, రైతులపై కక్ష, నిరుద్యోగులపట్ల ‘కాంట్రాక్ట్’ పరిహాసం. ఇవన్నీ ‘దేశం కోసం ధర్మం కోసం’అని మాయమాటలు చెప్పడం అవినీతి. ఈ దేశానికి శిరోధార్యమైన గాంధీ విలువల్ని సబర్మతీ తీరాన పూడ్చిపెట్టి, ఆయన హత్యను కూడా కీర్తించే కుసంస్కారం అవినీతి. ‘తిండి కోసం ఉద్యమాలు వస్తాయి’అని హెచ్చరిస్తున్న రైతునాయకుల మాటలు పట్టించుకోకుండా.. చమటోడ్చే రైతుల పంటను కొనకుండా, నేడు వరి, గోధుమ సైతం దిగుమతి చేసుకునే స్థితికి మన వ్యవసాయాన్ని దిగజార్చడం నీతి నిజాయితీ లేనితనం. నలుగురు గుజరాతీల గ్యాంగ్ తమ వ్యాపారం కోసం మొత్తం సమాజాన్ని కలుషితం చేయడం. నాటి ఈస్టిండియా కంపెనీని తలదన్నే రీతిలో దేశాన్ని గుల్ల చేయడం.. ఇదీ అవినీతి. అవినీతి అంటే అసలైన అర్థం మోదీ విధానాలే. తమను విధాన పరంగా వ్యతిరేకించే వారిపై కక్షగట్టి, అవినీతి అంటగట్టి, బెదిరించి, లొంగదీసుకునే ఈ కుతంత్రమే నిజమైన అవినీతి. కాబట్టి దేశ ప్రజలారా.. వీరి దుర్మార్గాలను గమనించండి. దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన వారి దాతలు ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతున్నరో.
బీదాబిక్కీ, మధ్యతరగతి ప్రజల శారీరక, బౌద్ధిక శ్రమ లేకపోతే ఈ దేశం లేదు. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ… తొలిదశ కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలోని యే ప్రభుత్వం కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు సవ్యంగా అందించలేకపోయింది. జీతాలు కూడా ఇవ్వలేకపోయింది, డబ్బు ఉన్న వర్గాలకు కూడా కావలసిన నిత్యావసరాలు సరఫరా చేయలేక పోయింది. ఎందుకంటే… ఉత్పత్తి నిలిచిపోయింది, సేవలు ఆగిపోయి నయి, ఉత్పత్తిలో ఉన్న శ్రామిక వర్గం, సేవల్లో ఉన్న మధ్యతరగతి వర్గం ఒక్క రోజు పనిచేయకపోతే ప్రగతి చక్రం స్తంభిస్తుంది. అలాంటిది నెలకు పైగా వస్తుసేవలు ఆగిపోతే దేశపు గతి ఏమవుతుందో చూసినం. అయినా కూడా,అట్లాంటి సమయంలో కూడా దీపాలు వెలిగించండి,పళ్ళాలు మోగించండి అని చెప్పే నాసిరకం నాయకత్వం చూసినం మనం.
ఈ దేశ నిర్మాతలు కాళ్ళు అరిగేలా, చంటిపిల్లలను భుజాలపై మోసుకుని, ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి కాలినడకన సొంతూర్లకు బయలు దేరడం చూసినం. వారి కోసం రైళ్లు ఏర్పాటు చేయండి అని ప్రతిపక్షాలు మొత్తుకుంటే, టికెట్ ధర వసూలు చేసిన దుర్మార్గం చూసినం. అందుకే వాగ్గేయకారుడు ఆదేశ్ రవి -‘బస్సులొద్దు, బండ్లు వద్దు అయ్య సారూ… ఇడిసి పెడితే, నడిసి నేను పోత సారూ’ అని వారి బాధను వినిపించిండు.
ఈ దేశ సంపద ఎవరిది? ఎవరి సృష్టి? వారిపట్ల కేంద్రప్రభుత్వ వైఖరి ఏమిటి? వారికోసం పనిచేస్తున్న పార్టీలు, ప్రభుత్వాల పట్ల కక్ష సాధింపు ఎందుకు? విపక్షాలను నేలమట్టం చేసి తామేమన్నా ప్రజలకు పైసా పనికి వస్తున్నరా? అదీ లేదు కదా? దీనిని మించిన అవినీతి ఉంటదా? వీరిని మించిన అనైతికులు ఉంటరా?
కాబట్టే.. కేసీఆర్ ‘బీజేపీ ముక్త్ భారత్’ దీక్ష తీసుకున్నరు. మనందరం ఆయనకు తోడుగా నడవవలసిందే. వేరే మార్గం లేదు. మేధావులు, పౌర వేదికలు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి రావాలి.
‘తిండి కోసం ఉద్యమాలు వస్తాయి’అని హెచ్చరిస్తున్న రైతునాయకుల మాట లు పట్టించుకోకుండా.. చమటోడ్చే రైతుల పంట ను కొనకుండా, నేడు వరి, గోధుమ సైతం దిగుమతి చేసుకునే స్థితికి మన వ్యవసాయాన్ని దిగజార్చడం నీతి, నిజాయితీ లేని తనం. నలుగురు గుజరాతీ గ్యాంగ్ తమ వ్యాపారం కోసం మొత్తం సమాజాన్ని కలుషితం చేయడం. నాటి ఈస్టిండియా కంపెనీని తలదన్నే రీతిలో దేశాన్ని గుల్ల చేయడం.. ఇదీ అవినీతి.
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371