రెండు వేల ఏండ్ల క్రితం యవన దేశ రాజు అలెగ్జాండర్ తన దేశ ప్రజలను గాలికి వదిలి, యుద్ధాలతో సైనికులను అష్టకష్టాల పాలుచేస్తూ అనేక దేశాలు జయించి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ, ఆ దేశాలను ఏం చేయాలి, ప్రజలకు ఎలా మంచి పాలకుడవ్వాలని ఆలోచించలేదు. అలాగే ప్రస్తుత మన భారతీయ అలెగ్జాండర్ దేశంలోని రాష్ర్టాలన్నీ తన పాలన కిందే ఉండాలని పన్నాగాలు పన్నుతున్నాడే గానీ, ఆ తర్వాత వాటిని ఎట్లా పాలించాలి అన్న భావనే లేకుండా ఉన్నాడు. దేశ సంపదను తనకు కావాల్సిన వారి దగ్గర ఉంచి, విదేశాల్లో ప్రతిష్ఠ పెంచుకుని విశ్వ గురు అవ్వాలని తాపత్రయపడుతున్నాడు.
దేశం లోపల బీజేపీని విస్తరించడం, ప్రపంచ దేశాల అభిమానాన్ని సంపాదించి విశ్వ గురు అన్న బిరుదు పొందటం ఈయన కోరికలు. అయితే ఈయన అనుసరిస్తున్న విధానాలు అందుకు తగినట్టు ఉన్నాయా? విశ్వ గురు అయ్యాక ఇంకేం చేయాలనుకుంటున్నాడు?… అంటే జవాబులు దొరకవు. ధనవంతులవ్వాలన్న వారికి రచయిత జాన్ రస్కిన్ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ‘మీరు ప్రపంచంలో అందరిలో కంటే ధనవంతులైతే ఏం చేస్తారు? ఒక ఇటుక బంగారం ఇస్తా, చాలా? లేదు.. 100 కిలోలు ఇస్తా, కాదు… కాదు ప్రపంచంలో బంగారం అంతా ఇస్తా. ఏం చేస్తారు దానితోని?’ అని. దురాశ పరులైన మానవులు ఏమీ చెయ్యరు, ఎవరికీ ఉపయోగపడరని ఆయన ప్రశ్నల తాత్పర్యం. ఇప్పుడు భారత దేశంలో 16 రాష్ర్టాలు బీజేపీ లేదా వారి మిత్ర పక్షాల పాలనలో ఉన్నాయి. ఇక మిగిలిన కొన్ని రాష్ర్టాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని బీజేపీ నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పాలనలో ఉన్న 16 రాష్ర్టాలు మిగతా వాటి కంటే మెరుగైన ప్రగతి సాధించి ఆదర్శంగా ఉన్నాయా అంటే.. లేవు.
అలాంటప్పుడు మిగతా రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చి ఆక్రమించి మీరేం చేయదలచుకున్నారు? ఒక జాతీయ విధానం రూపొందించారా? గత ఎనిమిదేండ్లుగా దేశంలో జరిగిందేమిటి? మీరు సాధించిన ఫలితాలు ఏమిటి అంటే ఏమీ కనిపించవు. అన్నీ వైఫల్యాలే కనిపిస్తాయి.
ఇప్పటివరకు బీజేపీ పాలనలో తగ్గినవి, చేయనివి చెప్పుకున్నాం. ఇక పెరిగినవి ఏమున్నామో చూద్దాం!
మరి ఇంత తక్కువ సమయంలో ఇన్ని పతకాలు సాధించగలిగిన ప్రధానమంత్రి విశ్వ గురు స్థానానికి అర్హుడేగా! ఈ ఎనిమిదేండ్లలో నరేంద్ర మోదీ ప్రసంగాలు, మంకీ మాటలను, ఆయన విస్తృత విదేశీ పర్యటనల్లో మాట్లాడిన మాటలను ఒక్క దగ్గర పెట్టుకుని వాటిని బీజేపీ విధానాలు, పాలనకు అన్వయించి పరిశీలిస్తే ఎవరికైనా గట్టి షాక్ తగలడం ఖాయం. ప్రవచించిన సూక్తులను పాటించకపోవడం వల్ల, చేసిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చకపోవడం వల్ల ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్యులంతా అల్లాడిపోతుంటే, భారతదేశం ప్రపంచానికే తలమానికంగా వెలిగిపోతోందన్న అనుభూతిని సామాన్య మానవుడికి కలిగించటం సాధ్యమా?… ఎన్నటికీ కాదు. అది సాధించగలిగినవాడు విశ్వ గురువు అన్న బిరుదుకి అర్హుడే! నమో నమః!
తాతల నాడు భారత్ నుంచి తరలిపోయిన కుటుంబానికి చెందిన వాడైన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయినప్పుడు అతడు భారతీయుడని పొంగిపోయాం. అలాగే మన కళ్ల ముందు రాజకీయాల్లో ఎదిగి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులు అలంకరించిన మన వాడు విశ్వ గురువు అయ్యాడంటే భారతీయులందరికీ ఆనందమేగా! భారతీయ విద్యార్థులను బ్రిటన్కు రానీయని రిషి, సామాన్య ప్రజలను ద్వేషిస్తూ బాధపెడుతున్న మోదీ మనవారే కదా! జబ్బలు చరచుకోవాలి. ఆనందిద్దాం! అభినందిద్దాం! అయితే అన్య దేశస్థులకు ఆలింగనాలు, స్వదేశంలో ఇతర రాష్ర్టాలతో అంతర్యుద్ధాలు సామెతకు వ్యతిరేకం కదా! ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అందరూ ఐన్స్టీన్లు కాలేరు మరి!
డాక్టర్ కనకదుర్గ దంటు: 89772 43484