రాష్ట్రంలో ప్రధాన విపక్ష నేతల తీరు రానురాను మరీ విడ్డూరంగా ఉంటున్నది. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయాన్నీ విమర్శించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పస లేని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖజానాకు రాబడి పడిపోయిన దరిమిలా, అనివార్యంగా భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొన్నది. అయినా ఈ చర్యను కాంగ్రెస్ నేతలు తప్పు పట్టడం ఆశ్చర్యం.
దేశంలో మరే రాష్ట్రంలోనూ, ఏ పాలకులూ ఇంతటి స్వల్పకాలంలో తమ రాష్ట్ర రైతుల భూముల విలువను అమాంతం పెంచే ఉపాయం చేసి ఉండరు. అన్నదాతలు నేడు దర్జాగా తలెత్తుకొని జీవిస్తున్నారు. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రించే స్వర్ణ యుగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ సాకారం చేశారు. ప్రతి గుంట, ప్రతి ఎకరమూ ఎంతో విలువైనదిగా రూపాంతరం చెందేదాకా తన మేధస్సును తెలంగాణ పౌర సమాజానికి పంచిన, పంచుతున్న ప్రజారంజక పాలకులు ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షే మ కార్యక్రమాలు నిలుపుదల లేకుండా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది. అన్నిమార్గాలూ వెతు కుతున్నది. చివరి రూపాయీ సర్కారు గల్లా పెట్టెకు చేరేలా అధిక ధరలు దక్కేలా జాగ్రత్తలు చేపట్టింది. ప్రతి దశలోనూ పారదర్శకత కోసం ప్రాధాన్యం ఇచ్చింది. ఇదేమీ చాటుమాటుగా చేస్తున్నదేమీ కాదు. దీనిపై కాంగ్రెస్ నేత భట్టి మాత్రం వింతగా స్పందిస్తున్నారు. భూములు ఎవరూ కొనవద్దనీ, మోఖా మీదికిపోయి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ ప్రభుత్వం వచ్చాక వెనక్కి లాక్కుంటామంటున్నారు. ప్రభుత్వమే చట్టబద్ధంగా వేలం పాట ద్వారా విక్రయించాక మళ్లీ గుంజుకోవడం ఏమిటి? పాలక పార్టీ ఏదైనా, ప్రభుత్వం ప్రభుత్వమే కదా. మరి ఈ సూక్ష్మాన్ని ఆయన ఎందుకు గ్రహించడం లేదు! వాళ్ల పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమనేది పగటి కల!
బీజేపీ నాయకుల మాటల తీరు కూడా విచిత్రంగా ఉన్నది. వేల మందికి అన్నం పెడుతున్న వైజాగ్ స్టీల్ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అంగట్లో పెట్టవచ్చు. కానీ, దశాబ్దాలుగా నిరర్థకంగా, ఎప్పుడు, ఏ ఆక్రమణదారుడి కన్ను పడుతుందో తెలియని ప్రభుత్వ స్థలాలను గరిష్ట ధరకు అమ్మేసి ప్రజా అవసరాలకు వెచ్చించడం మాత్రం చేయవద్దట. నిజానికి భూములను కొనుగోలు చేసి నవారిలో చాలామంది ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడతారు. ఆ విధంగానూ పౌరులకు ఉపాధి దొరుకుతుంది. కనీసం ఈ అంశాన్ని కూడా కమలనాథులు గ్రహించడం లేదు. నిత్యం ఏదో ఒకటి అడ్డగోలు వాదనలతో ప్రభుత్వం మీద పడి ఏడుస్తుంటారు. ఇక ఆ పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తొండి మాటలకైతే లెక్కే లేదు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కొత్తల కార్యకర్తలు ఎంతో ఆశపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన తీరుతో కార్యకర్తల్లో నిరాశ మొదలైంది. తెల్లారి లేస్తే దూషణలు! అవినీతి, జైలు అంటూ అడ్డమైన మాటలు మాట్లాడుతు న్నారు. విలువ, విశ్వాసం, నైతికత లేని వ్యాఖ్యలు చేస్తుంటారు. కేంద్రంలో బీజేపీ అధికార పార్టీ, బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడు కూడా. అయినా ఆ హోదాకు తగినట్లు మాట్లాడటం లేదు. రాజకీయాలు వేరు, రాష్ట్ర బాగోగులు వేరు. తెలంగాణ హితం కోసం కేసీఆర్తో గొంతు కలిపి, కేం ద్రం ద్వారా ఏదైనా సాధించినప్పుడే రాష్ట్రంలో బీజేపీ గౌరవం దక్కుతుంది. హెలికాప్టర్ మనీ గురించి సూటిగా సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఒక మన రాష్ట్రం కోసమే కాదు, యావత్ దేశ ప్రజల ప్రయోజనాలను మన సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నేరుగా ప్రధానికే సూచించారు. మరి ఆ సూచనకు రాష్ట్ర బీజేపీ సారధిగా సంజయ్ ఎందు కు మద్దతివ్వలేదు? ఈ మేరకు తమ తరఫున ప్రధానికి ఎందుకు వినతి పత్రం అందజేయలేదు? బీజేపీ నేతలు తమ కనీస బాధ్యతలనేమో విస్మరిస్తారు. రాష్ట్ర అవసరాల కోసం భూములను అమ్మి తే మాత్రం తప్పుపడతారు. యథార్థానికి రాష్ట్రం లో సంపద సృష్టికి, భూముల విలువ అమాంతం పెరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా పటిమే కారణం.
రాష్ట్రంలో వ్యవసాయ భూముల ధర భారీగా పెరిగింది. ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.కోటి దాకా పెరిగింది. ఆయకట్టు, ఆయకట్టేతర, భౌగోళిక స్వరూపం, చుట్టుపక్కల స్థితిగతులు, మౌత్ టు మౌత్ టాక్, విపణి వ్యవహారాల వంటి కారణాల మూలంగా భూములు ఎక్కువ ధర పలుకుతున్నాయి. విపక్షనేతల ఆస్తుల విలువ కూడా పెరిగినట్లే కదా! ముఖ్యమం త్రి కేసీఆర్ పాలనాపగ్గాలు అందుకున్న శుభ గడియల మహత్తు కాబోలు! తెలంగాణ నలుమూలల్లో భూములకు క్రమంగా డిమాండ్ పెరిగిపోయింది. కాళేశ్వరం, ఇతర సాగు ప్రాజెక్టుల సానుకూల ప్రభావం నేరుగా భూములపైనే ప్రసరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, భూమి దొరుకుడే బంగారమైంది. బంగారు తెలంగాణ భావన నేరుగా లక్షల మంది వ్యవసాయదారులకు అనుభవైకవేద్యమైంది. తెలంగాణ కోసం తన సర్వశక్తులూ ధారపోసిన ఒకే ఒక్క కేసీఆర్ మేధోశక్తితో ఇవాళ ఎందరో కర్షకులు తమ ఆస్తులకు కోటీశ్వరులు, లక్షాధికారులయ్యారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ, ఏ పాలకులూ ఇంతటి స్వల్ప కాలంలో తమ రాష్ట్ర రైతుల భూముల విలువను అమాంతం పెంచే ఉపాయం చేసి ఉండరు. అన్నదాతలు నేడు దర్జాగా తలెత్తుకొని జీవిస్తున్నారు. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రించే స్వర్ణ యుగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రదా త కేసీఆర్ సాకారం చేశారు. ప్రతి గుంట, ప్రతి ఎకరమూ ఎంతో విలువైనదిగా రూపాంతరం చెందేదాకా తన మేధస్సును తెలంగాణ పౌర సమాజానికి పంచిన, పంచుతున్న ప్రజారంజక పాలకులు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విష యం విపక్షాలు గుర్తెరగాలి.(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
–దుర్గాప్రసాద్ ఇల్లెందుల