తెలంగాణ పల్లెల్లో నాటికి నేటికీ ఊహించని మార్పులు! చీకట్లో నిద్రించే గ్రామాలిప్పుడు విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. పట్టణాల మాదిరిగా ప్రజా జీవనం అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నది. పరిశుభ్రత మొదలుకొని వివిధ పౌర సదుపాయాల కల్పనలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా వాసికెక్కుతున్నది. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ పంచాయతీ స్వశక్తికరణ్ పురస్కారా’లకు మన రాష్ట్రంలోని తొమ్మిది గ్రామ పంచాయతీలు, రెండు మండల పరిషత్లతోపాటు ఒక జిల్లా పరిషత్ ఎంపికవడం ఇందుకు నిదర్శనం.
నిధుల లేమితో కొట్టుమిట్టాడే గ్రామాలకు నేడు కేంద్ర నిధులకు దీటుగా రాష్ట్ర ప్రభు త్వం నిధులను సమకూర్చుతున్నది. ఫలితం గా గ్రామాల్లో వ్యవస్థాపక సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్డు లేని గ్రామం లేదు. మరో విశేషమేమంటే ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ లేని గ్రామం కూడా లేదు.
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటుతోపాటు ఐదువందల జనాభా దాటిన ప్రతి గ్రామాన్ని పంచాయతీలుగా మార్చింది. ‘మా తండాలో- మా రాజ్యం’లో భాగంగా ప్రతి గూడెం, తండాకు సైతం గ్రామపంచాయతీ హోదా కల్పించింది. దీంతో మారుమూల గ్రామాలకు సైతం నిధులు అందడంతో మునుపెన్నడూ లేని రీతిలో గ్రామాలు అభివృ ద్ధి చెందుతున్నాయి. గ్రామాల్లో పటిష్ఠ పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగా ణ పంచాయతీరాజ్ చట్టం’2018 ఏప్రిల్ 18 నుంచి అమలులోకి వచ్చింది. చట్ట పరిభాషతో కాకుండా సాధారణ పదాలతో రూపొందించిన ఈ చట్టం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంది. హరితహారం కార్యక్రమా న్ని చట్టంలో పొందుపరచడంతో దానికి చట్టబద్ధత కలిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికి ఆరు మొక్కలను అందించాలనే నిబంధనను చేర్చా రు. నాటిన మొక్కలలో 85% సంరక్షించే బాధ్యతలను అధికారులతోపాటు పాలక మం డలికి అప్పగించారు. ఫలితంగా నేడు గ్రామా లు హరితవనాలతో అలరారుతున్నాయి. ఎటుచూసినా పచ్చదనంతో పల్లెలు కనువిందు చేస్తున్నాయి.
ఇదివరలో వీధుల శుభ్రత సంగతి చెప్పే పనేలేదు. ఎవరూ పట్టించుకోకుండా మురికితో చెత్తాచెదారంతో నిండి ఉండేవి. ఇప్పుడు పరిశుభ్రతతో ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం రూ.8500 గౌరవ వేతనంతో పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. వారికి ప్రతి నెలా మొదటివారంలోనే జీతం అందేలా చర్యలు తీసుకున్నది. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఫలితంగా సీజనల్ వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. దవాఖాన ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతున్నది. పరిపాలన మెరుగుపరిచే దిశ లో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది. దీంతో గ్రామాల్లో పౌరసేవలు మెరుగయ్యాయి. జనన మరణాల ధ్రువీకరణ పత్రాల నుంచి వివాహ ధ్రువీకరణ పత్రాల వరకు, ఇంటి అనుమతులు మొదలుకొని వ్యాపార లైసెన్సుల దాకా ఎన్నో సేవలు త్వరితగతిన అందుతున్నాయి.
నిధుల లేమితో కొట్టుమిట్టాడే గ్రామాలకు నేడు కేంద్ర నిధులకు దీటుగా రాష్ట్ర ప్రభు త్వం నిధులను సమకూర్చుతున్నది. ఫలితం గా గ్రామాల్లో వ్యవస్థాపక సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్డు లేని గ్రామం లేదు. మరో విశేషమేమంటే ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ లేని గ్రామం కూడా లేదు. ట్రాక్టర్ సహాయంతో గ్రామాల్లో సేకరించిన చెత్తను కంపోస్ట్ షెడ్లకు తరలించి, అక్కడ తడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నది. బహుశా దేశంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కలిగి ఉన్న రాష్ట్రం మనదొక్కటే కావచ్చు. గ్రామసభను బలోపేతం చేస్తూ ఇటీవల గ్రామసభ ఆమోదంతో నిధులను ఖర్చు చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలను నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చటం గమనార్హం.
ఏటా ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భా న్ని పురస్కరించుకొని ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా రూపొందించుకునే దిశగా కదలాలి. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో క్రియాశీల భాగస్వాములు కావాలి. వచ్చే ఏటికి మరిన్ని అవార్డులు- రివార్డులు గెలుచుకోవాలి. ఆ దిశగా అందరం కృషి చేద్దాం.
పుల్లూరు
జగదీశ్వర్ రావు