మణికొండ : యువతచూపు టీఆర్ఎస్ వైపు ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మణికొండ మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 200 మంది యువత ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ర్ట అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్ లో చేరేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారని, టీఆర్ఎస్ మాత్రమే ప్రతి కార్యకర్తను కాపాడుకుంటుందన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.
పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో చనిపోతే 2లక్షల బీమా ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. ప్రజాసేవ కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో అక్రమ్ , అలీభాయ్, ట్రెస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.