కోస్గి, డిసెంబర్ 31: 2022 నూతన సంవత్సరానికి పాఠశాల విద్యార్థులు ఆహ్వానం పలికారు. శుక్రవారం నా చారం గ్రామంలోని కేజీబీవీ విద్యార్థులు తమ పాఠశాలలో 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవ త్సరానికి ఆహ్వానం పలికి తమ చార్టులపై రంగురంగులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన ప్లకా ర్డులు ప్రదర్శించారు. ఈ ఏడాదైనా ఎలాంటి ఆటంకం లే కుండా పాఠశాలలు సజావుగా నడవాలని తమ చదువులు సక్కంగుండాలని కోరుకున్నారు.
సిద్ధంగా కేకులు
నారాయణపేటరూరల్, డిసెంబర్ 31: కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు పట్టణంలోని వివిధ బేకరీలతో పాటు మండలంలోని జాజాపూర్, కోటకొండ, కొల్లంపల్లి గ్రామాల్లోని వివిధ బేకరీల్లో నిర్వాహకులు రకరకాల కేకులు సిద్ధం చేసి విక్రయాలు చేపట్టారు. యువకులు, చిన్నారులు ఆయా దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో కేకులు కొనుగోలు చేయడానికి బారులుదీరారు.
‘కొవిడ్ నిబంధనలు మరువొద్దు’
మాగనూర్ డిసెంబర్ 31: పండుగ సంబురంలో ఉండి కొవిడ్ నిబంధనలు మరువొద్దని వైద్యశాఖ హెచ్చరిస్తున్నదని మండల వైద్యాధికారి శ్రీమంత్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సమూహంలో కలవడం భౌతికదూరం పాటించపోవడం, శానిటైజేషన్ చేసుకోకపోవడం వంటి నిర్లక్ష్యంతో తిరిగి మహమ్మారి రెచ్చిపోతుందని అంటున్నారు.. గత నెల నుంచి వరుస గా గణేశ్, బతుకమ్మ, దసరా సంబురాలు అయిపోయాయని ఇప్పటికే ప్రజలు కొంత అజాగ్రత్తగా ఉంటున్నారని, భౌతికదూరం పాటించకుండా తిరుగుతూ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారన్నారు. న్యూ ఇయర్ వేళ జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్లు ధరించాలని, చేతులు తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. స్వీయ జాగ్రత్తలు మరువకుండా నిత్యం ఆచరించాలి లేదంటే చాలావరకు తగ్గిన కేసులు తిరిగి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. నిరక్ష్యంగా ఉంటే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. గతంలో మాదిరి వ్యక్తిగత అప్రమత్తత ఆచరించాలి. పటాకులు కాల్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, పటాకులు కాల్చినప్పుడు వెదజల్లే పొగ కెమికల్తో కూడుకొని ఉంటుంది కనుక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. పటాకులు కాల్చినప్పుడు శానిటైజర్తో కాకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలని తెలిపారు. ఉమ్మడి మండలంలో 18 సంవత్సరాలు నిం డిన ప్రతి ఒక్కరూ 1,2 డోసుల టీకాలు వేసుకొని కరోనా రహిత మండలాలుగా తీర్చిదిద్దాలన్నారు.