హఫీజ్పేట్ : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి అగ్రపథంలో నిలుపుతానని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్హఫీజ్పేట్, యూత్కాలనీ, శాంతినగర్, మదీనగూడ, హుడాకాలనీలో రూ. 1కోటి అంచనావ్యయంతో చేపట్టబోయే పలుఅభివృద్ధి పనులకు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ పూజితజగదీశ్వర్గౌడ్తోకలిసి శంకుస్ధాపనచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కరోనావంటి విపత్కర పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే ఉద్ధేశ్యంతో రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి అగ్రపధాన నిలుపుతామన్నారు.
అభివృద్ధి పనులను నాణ్యతాప్రమాణాలతో త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు కల్గకుండాచూడాలన్నారు. డివిజన్ గౌరవఅధ్యక్షులు వాలా హరీష్రావు, అధ్యక్షులు గౌతంగౌడ్, నాయకులు సంజీవరెడ్డి, యాదగిరిగౌడ్, వెంకటేష్గౌడ్, నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.