ఎల్బీనగర్, జనవరి 7: దిల్సుఖ్నగర్లో ట్రేడర్స్కు, వీధి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అందరూ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. దిల్సుఖ్నగర్లోని గడ్డిఅన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. వీధి వ్యాపారులను కూడా క్రమబద్ధీకరించి వెంకటాద్రి థియేటర్ నుంచి దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వరకు సర్వీస్ రోడ్డులో నడిసే అవకాశమే కాదు.. కార్లు కూడా సాఫీగా సాగిపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డు చిరు వ్యాపారుల విషయంలోనూ త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేం మహేశ్వర్రెడ్డి, గడ్డిఅన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తులసీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మార్గం రమేశ్, ప్రతినిధులు బాలరాజు గుప్తా, శ్రీనివాస్ యాదవ్, గోపాల కృష్ణ, షఫీ, శ్రీనివాస్, అనంతుల రాజారెడ్డి, అరవింద్ రెడ్డి, సరూర్నగర్ సీఐ సీతారాం, అధికారులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు ప్రారంభం..
దిల్సుఖ్నగర్ కోణార్క్ థియేటర్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు సర్వీస్ రోడ్డులో నూనతంగా వేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కార్పొరేటర్ బద్దం ప్రేం మహేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్డును బాగుచేయించడం పట్ల ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కార్పొరేటర్ బద్దం ప్రేం మహేశ్వర్రెడ్డితో పాటుగా సీఐ సీతారాం, విద్యుత్ శాఖ అధికారి రాజును ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తులసీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మార్గం రమేశ్తో పాటుగా ప్రతినిధులు సన్మానించారు.