వనపర్తి, డిసెంబర్ 23 : కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ తూకం, నాణ్యత, స్వచ్ఛత, సరైన ధర పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. కానీ.. ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువయ్యాయి. పాలు, నీళ్లలో కూడా నాణ్యత కరువైంది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు వినియోగదారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నాణ్యత లేని వస్తువులను కొ నుగోలు చేస్తే మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటాం. ఈ తరుణంలో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా
ప్రత్యేక కథనం..
1986లో భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణకు విప్లవాత్మకమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం అమలుచేసేందుకు ప్రత్యేకంగా రీడ్రసల్ ఫోరం (వినియోగదారుల సమస్యలు పరిష్కరించే, నివారించే ప్రత్యేక కోర్టులు)ను ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేసింది. వీటిని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరం కమిటీ సభ్యులుగా విభజించారు.
ఫిర్యాదు ఇలా..
ఒక వ్యాపారి, డీలర్ వద్ద వినియోగదారుడు అన్యాయంగా నష్టపోతే సదరు వ్యక్తిపై లేదా సంస్థపై ఫిర్యాదు చేయొచ్చు. వస్తువులో ఒకటి కంటే ఎక్కువ లోపాలు ఉన్నప్పుడు సర్వీస్ విషయంలో డీలర్ అశ్రద్ధ చే స్తే.., ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయొచ్చు. వస్తువు, సేవ విలువ కో రే నష్టపరిహారం రూ.లక్ష వరకు అయితే కోర్టుఫీజు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వర కు రూ.200, రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షలకు పైన రూ.500 నామమాత్రపు కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారుడి
పూర్తి పేరు, చిరునామా, ఇతర వివరాలు ఇవ్వాలి. అలాగే మోసం చేసిన వ్యక్తి (వ్యాపారస్తుడు లేదా డీలర్) పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గట కారణాలు.. ఎప్పుడు, ఎలా జరిగింది.. ఎలా నష్టపోయారు..? దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలి. రసీదులు, డాక్యుమెంట్లు, ఫొటోలు జీరాక్స్లు ఇవ్వాలి. కేసు విచారణకు వచ్చినప్పుడు ఒరిజినల్స్తో వెళ్లాలి.
కొనుగోలు విషయంలో సూచనలు..
కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్కు చెందినవి.., వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చితంగా గమనించాలి.మందులు, ఆహార పదార్ధాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్పై చూపాలి.కాస్మోటిక్ ఉత్పత్తులపై తప్పకుండా ధర, తయారీ, గడువు తేదీ, తయారీదారుడి చిరునామా ఉన్నాయో లేదో చూసుకోవాలి.ఉత్పత్తులపై ఉన్న ఎమ్మార్పీ స్టిక్కర్పై వేరే పేపర్ అంటించి ధర మా ర్చిఅమ్ముతుంటారు.ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వస్తువులకు బిల్లు తీసుకోవాలి..
ప్రతి వినియోగదారుడూ కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లు తీసుకోవాలి. ఎలాంటి మోసాలకు గురి కావొద్దు. జాగ్రత్తగా వ్యవహరించాలి. నాణ్యత లోపిస్తే గట్టిగా ప్రశ్నించాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే జిల్లా వినియోగదారుల ఫోరంను సంప్రదించాలి.