దోమకొండ, జనవరి 6 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని చింతమాన్పల్లి, ముత్యంపేటలో వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనాలు, కంపోస్ట్షెడ్లతోపాటు ముత్యంపేట – దోమకొండ వాగుపై నిర్మించిన బ్రిడ్జి, చింతమాన్పల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనాలు, కంపోస్ట్షెడ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకోవడంతో పాటు శుభ్రంగా మారాయని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రేమ్కుమార్, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్, ఏఎంసీ చైర్మన్ శేఖర్, సర్పంచులు సార్ల నర్సవ్వ, నర్సింహులు, సూర్యప్రకాశ్రెడ్డి, విండో చైర్మన్ కొడిప్యాక తిరుపతిగౌడ్, ఉపసర్పంచ్ శిరీశ్ గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.