గోల్నాక : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలోని వైష్ణవ ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. గురువారం తెల్లవారు జామునుంచే తిలక్నగర్ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
ఈ సందర్భంగా ఉదయం నుంచే స్వామి వారికి మహాభిషేకంతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.