మన్సూరాబాద్ : నిరుపేద కుటంబంలో జరుగుతున్న ఓ వివాహానికి ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. చైతన్యపురి, ప్రభాత్నగర్కు చెందిన బోయిని ఇందిర, ఈశ్వరయ్య దంపతుల కుమార్తె శ్వేత, గచ్చిబౌలి, అంజయ్యనగర్కాలనీకి చెందిన చీర్ల శ్రీనివాస్ సాగర్, మాసమ్మ దంపతలు కుమార్తె శిరీష ల వివాహం ఇటీవల నిశ్చయమైంది.
కాగా వారి ఆర్థిక పరిస్థితిపై స్థానికులు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి ఉప్పల ఫౌండేషన్ సంస్థ ద్వార సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.
నాగోల్లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు కుటుంబాలలో జరుగుతున్న వివాహాలకు గాను పుస్తె, మట్టెలు, చీర, గాజులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రేమ్కుమార్ ముదిరాజ్, గోపాల్, సుజాత శ్రీనివాస్, శ్వేత, చీర్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.